హైదరాబాద్ నగరంలోని ఫీనిక్స్ గ్రుప్ కంపెనీ పై ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు దాడులు చేశారు. ఫీనిక్స్ కంపెనీ సహా సంస్థ డైరెక్టర్ల నివాసాల్లో ఐటీ అధికారులు ఈ రోజు ఉదయం నుండి సోదాలు నిర్వహిస్తున్నారు. ఫీనిక్స్ సంస్థ చైర్మన్ చుక్కపల్లి సురేష్ బర్త్ డే వేడుకలను ఇటీవల హెచ్ఐసీసీలో ఘన నిర్వహించుకున్నారు. ఆయన జన్మదిన వేడుకలకు రాజకీయ ప్రముఖులు, వీఐపీలు, కలెక్టర్ లు, బాలివుడ్, టాలీవుడ్ స్టార్లు హజరైయ్యారు. జన్మదిన వేడుకలకు భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. మరో పక్క ఫీనిక్స్ సంస్థలో పలువురు రాజకీయ నేతల పెట్టుబడులు కూడా పెట్టినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఐటీ దృష్టి ఫీనిక్స్ సంస్థపై పడింది.
ఫీనిక్స్ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తొంది. ఈ సంస్థ లావాదేవీలపై దృష్టి సారించిన ఐటీ అధికారులు .. మంగళవారం నానక్ రాంగూడ, గోల్ప్ ఎడ్జ్, ఆఫీసులతో పాటు నగరంలోని 20 ప్రదేశాల్లో సోదాలు జరుపుతున్నారు. ఈ పరిణామం ఆ సంస్థతో సంబంధాలు ఉన్న రాజకీయ నేతల్లో గుబులు రేకెత్తిస్తొంది. సాయంత్రానికి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.