KTR :తెలంగాణ సీఎం మార్పు… నూతన ముఖ్యమంత్రిగా కేటీఆర్ కు చాన్స్ అంటూ నేతలు మాట్లాడుతున్న తీరుపై పార్టీ సమావేశంలో సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వరుసగా సీఎం మార్పుపై నేతలు మాట్లాడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. తానే సీఎంగా ఉంటానని నేతలకు కేసీఆర్ తేల్చి చెప్పారు . ఇకపై ఎవరైనా ఈ అంశంపై మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే ఇప్పుడు మరోవైపు నుంచి సీఎం పదవికి పేరు ప్రతిపాదించబడింది.
కేసీఆర్ కీలక ప్రకటన
తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని ప్రకటించిన కేసీఆర్ ముఖ్యమంత్రి మార్పుపై ఎవరూ నోటికొచ్చినట్లు మాట్లాడొద్దని అన్నారు. నా ఆరోగ్యం సహకరించకుంటే నేనే చెప్తా అప్పుడు ఎవర్ని సీఎం చేయాలన్నది మీతోనే మాట్లాడతా అని కేసీఆర్ అన్నారు. ఇంకో పదేళ్లు తానే ముఖ్యమంత్రి పీఠంలో ఉంటానన్న క్లారిటీ సైతం ఇచ్చేశారు. అయితే దీనిపై బీజేపీ సెటైరికల్ గా స్పందించింది.
బీజేపీకి భలే చాన్స్ దొరికింది KTR
గులాబీ డ్రామాకి తెర పడిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు. సీఎం పీఠం గురించి కేటీఆర్ మాట్లాడిస్తే ఎమ్మెల్యేలు మాట్లాడారని.. మూడు నెలల నుంచి కళ్ళు ముసుకున్నవా? అని కేసీఆర్ ను ప్రశ్నించారు. కేసీఆర్ పై ప్రజలకు, ఆ పార్టీ నాయకలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు విరక్తి పుట్టిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ లో ఈటల రాజేందర్ కు తప్ప ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఎవరికి లేదని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కొత్త బాంబ్ పేల్చారు. 2023 వరకు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉండాలని..ఆయన్ని గద్దె దించి తాము అధికారంలోకి వస్తామన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ కు ఓటమి తప్పదని అర్వింద్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలపై అనుచితంగా, ఆ మర్యాదగా మాట్లాడటం రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు. కేసీఆర్ ఎమ్మెల్యేలపై గవర్నర్ కి లేఖ రాస్తానన్నారు. ఎన్టీఆర్ లాంటి మహనాయకుడికే ఓటమి తప్పలేదన్న ఆయన కేసీఆర్ ఎంతా? అని కామెంట్ చేశారు. అయితే, టీఆర్ఎస్ పార్టీలో సీఎం పీఠం చర్చకు పార్టీ రథసారథి ఫుల్ స్టాప్ పెడితే మరోపార్టీ మాత్రం దాన్ని కొసాగించడం గమనార్హం.