Peddi Reddy : స్టేట్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. న్యాయస్థానాలలో తీర్పులు అనుకూలంగా రావడంతో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటూ సరికొత్త అడుగులు వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో నిమ్మగడ్డకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం పంచాయతీలో అన్ని ఏకగ్రీవం కావాలని వాటికి నజరానా ప్రకటించటం ఏపీ రాజకీయాల్లో మరింత రాజకీయ వేడిని రాజేస్తుందని అంటున్నారు.
పరిస్థితి ఇలా ఉండగా పంచాయితీ ఏకగ్రీవ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి పెద్దిరెడ్డి. మేటర్ లోకి వెళ్తే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉత్తర్వులు మేరకు పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమములో శాంతియుత వాతావరణంలో ఏకగ్రీవం అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం ఉండదని అందువల్లే ప్రభుత్వం ఆధ్వర్యంలో జీవో-36/2020 ఇచ్చామని తెలిపారు. గతంలో గుజరాత్, హర్యానా, పంజాబ్ అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఏకగ్రీవ ఎన్నికలే జరిగాయని తాజాగా గుర్తుచేశారు.
అంతేకాకుండా పంచాయతీలకు ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వటం జరిగిందని..ఏకగ్రీవం అయిన పంచాయితీలకు ఇక్కడా కూడా ఇన్సెంటీవ్స్ ఇస్తామని అన్నారు. ఇదే క్రమంలో ఎస్ఈసీ ఒక పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని ఆయన నిర్ణయాలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా ఏకగ్రీవాలు పై ఐజీ స్థాయి లాంటి అధికారిని నియమించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.