Revanth Reddy: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడుగా మల్కాజ్గిరి ఎంపి రేవంత్ రెడ్డి నియమితులైయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. వర్కింగ్ ప్రసిడెంట్లుగా మహమ్మద్ అజారుద్దీన్, జే గీతారెడ్డి, ఎం అంజన్ యావద్, టి జగ్గారెడ్డి, బీ మహేష్ కుమార్ గౌడ్ లు నియమితులైయ్యారు. ఉపాధ్యక్షులుగా సంభాని చంద్రశేఖర్, దామోదరరెడ్డి, మల్లు రవి, పాదెం వీరయ్య, సురేష్ షెట్కర్, వేం నరేందర్ రెడ్డి, రమేష్ ముదిరాజ్, గోపిశెట్టి నిరంజన్, టి కుమార్ రావు, జావెద్ లను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, కన్వీనర్ గా సయ్యద్ అజమ్ తుల్లా హుస్సేనీ, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా దామోదర్ సి రాజనర్శింహయ్య, ఎఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ గా ఆలేటి మహేశ్వరరెడ్డి లను నియమించింది.