YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ అవినాష్ రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి బిగ్ రిలీఫ్ లభించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ పిటిషన్ పై తీర్పు సందర్భంగా న్యాయమూర్తి మరో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ వైఎస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ విచారణ ముగిసిన తర్వాత మద్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ మధ్యంతర ఉత్తర్వులపై టీవీ చర్చల్లో పాల్గొన్న సస్పెండైన మెజిస్ట్రేట్ ఆ ఉత్తర్వులను తప్పుబడుతూ, న్యాయమూర్తికి దురుద్దేశాలు ఆపాదిస్తూ వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తికి డబ్బు సంచులు వెళ్లాయంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఏబీఎన్, మహా టీవీ ఛానళ్లలో ఈ నెల 26వ తేదీ జరిగిన చర్చల వీడియోలను ఇవ్వాలని రిజిస్ట్రార్ కు న్యాయమూర్తి ఆదేశించారు. ఆ వీడియోలను డౌన్ లోడ్ చేసి తెలంగాణ హైకోర్టు సీజేకి అందించాలని ఆదేశించారు. టీవీ చర్చల్లో చేసిన కామెంట్స్ చూసి తాను తీవ్రంగా కలత చెందినట్లుగా ఈ సందర్భంగా న్యాయమూర్తి తెలిపారు.
మీడియా అంటే తమకు పూర్తి గౌరవం ఉంది, మీడియా స్వేచ్చకు తాము అడ్డంకి కాదు కానీ కొన్ని మీడియా సంస్థలు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాయని న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక స్థాయిలో విచారణ నుండి తప్పుకోవాలని కూడా భావించాననీ, కానీ సుప్రీం కోర్టు ఆదేశాలు, పవిత్రమైన న్యాయవ్యవస్థపై ఉన్న గౌరవంతో విచారణను కొనసాగించినట్లు తెలిపారు. న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకున్నట్లు చెప్పారు. టీవీ ఛానళ్లలో జరిగిన చర్చ కోర్టు దిక్కరణ కిందకు వస్తుందనీ, దీనిపై చర్యలు తీసుకోవాలా వద్దా అనేది హైకోర్టు నిర్ణయిస్తుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇది ఒక రకంగా ఏకపక్షంగా డిబేట్ లు నిర్వహించే టీవీ ఛానళ్లకు, ఇష్టానురీతిలో మాట్లాడే వారికి షాకింగ్ నిర్ణయమే అని చెప్పవచ్చు.
Big Breaking: తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డికి బిగ్ రిలీఫ్ .. షరతులతో కూడిన బెయిల్ మంజూరు