దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. దీనిలో భాగంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమం పేరట ప్రతి ఇంటిలో జాతీయ జెండా ఆవిష్కరించాలని పిలుపునివ్వడం తెలిసిందే. అంతేకాదు సోషల్ మీడియాలో తమ ప్రొఫైల్ పిక్ గా దేశ జాతీయ జెండాని పెట్టాలని కేంద్ర పెద్దలు పిలుపునివ్వడం జరిగింది. ఇదిలా ఉంటే దేశ స్వాతంత్ర 75వ ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం 5కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలనుండి రెస్పాన్స్ వచ్చింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ 5K ఫ్రీడమ్ రన్ లో అన్ని జిల్లాలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీలు మరియు రాష్ట్ర శాసనసభ్యులు ఇంకా మంత్రులు పాల్గొన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వాతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లో బంజారాహిల్స్ లో కొత్తగా ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుండి గురువారం నిర్వహించిన 5కే రన్ కి తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ ఆలీ జండా ఊపి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి వి ఈ.. ఆనంద్.. ఇంకా ఎమ్మెల్యే డి నాగేందర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్… పాల్గొనడం జరిగింది. పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి ఎన్టీఆర్ భవన్ వరకు ఈ 5కే రన్ నిర్వహించబడింది. ఈ క్రమంలో నగరంలో పలుచోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ కార్యక్రమంలో డీజే టీలు సినిమా సాంగ్ కి సిపి సివి ఆనంద్ తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు డాన్సులు వేయడంతో సందడి వాతావరణం నెలకొంది. చాలా ఉత్సాహంగా హైదరాబాదులో నిన్న 5కే రన్ నిర్వహించడం జరిగింది.