Phone tapping case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం తీవ్ర సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో పలువురు పోలీస్ అధికారులను అరెస్టు చేసి విచారణ జరుపుతుండగా, అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో గత ప్రభుత్వ హయాంలోని పార్టీ పెద్దల ప్రమేయంతో పాటు పలువురు ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి.
ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తొలిసారిగా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతోందని తెలిపారు. పాత బస్తీ ఈద్గా వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. కేసు విచారణ వేగంగా జరుగుతోందని అన్నారు. దర్యాప్తు క్రమపద్దతిలో సాగుతోందని అన్నారు. రాజకీయ నేతలకు నోటీసులు ఇవ్వనున్నారా అనే ప్రశ్నకు సీపీ స్పందిస్తూ .. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
మరో పక్క గతంలో ఫోన్ ట్యాంపింగ్ కు గురైన బాధితులు కొందరు సదరు పోలీస్ అధికారులపై ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Inter Results: ఇంటర్ విద్యార్ధులకు గుడ్ న్యూస్ .. ఫలితాలు విడుదల రేపే