Sri Rama Navami: శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం పుణ్యక్షేత్రంలో శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం జరిగింది. మిథులా స్టేడియం లోని మండలంలో సీతారాముల కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
ముందుగా శ్రీసీతారాముల ఉత్సవ విగ్రహాలను కళ్యాణ మండపానికి ఊరేగింపుగా అర్చకులు తీసుకువచ్చారు. భక్తుల జయజయధ్వానాల నడుమ కళ్యాణ క్రతువును వేదపండితులు పూర్తి చేశారు. అభిజిత్ లగ్నంలో సీతారాములకు రుత్వికులు జీలకర్ర బెల్లం పెట్టారు. ఆపై సీతమ్మ మెడలో రామయ్య మంగళ్యధారణ చేశారు. తర్వాత తలంబ్రాల కార్యక్రమం జరిగింది.
ఈ వేడుకల సందర్భంగా సీతారాములకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీతారాముల కళ్యాణోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో చేశారు.
శ్రీరామ నామస్మరణతో భద్రాచలం వీధులు మార్మోగుతున్నాయి. కళ్యాణాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ తో పాటు ప్రజా ప్రతినిధులు హజరైయ్యారు.
Ayodhya: అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం .. సూర్య తిలకాన్ని దర్శించి తరించిన భక్తులు