కరోనా వైరస్ నేపథ్యంలో రోజుకో కొత్త వ్యాక్సిన్ వచ్చింది అంటూ ప్రచారాలు మొదలైపోయాయి. తాజాగా రష్యా వారు హ్యూమన్ ట్రయల్స్ ను చాలా విజయవంతంగా పూర్తి చేశారని కొద్దిరోజుల్లో వ్యాక్సిన్ వస్తుందని వార్తలు వచ్చినా అది కనీసం మరొక ఆరు నెలలు పడుతుందని అధికారికంగా స్పష్టత వచ్చేసింది. ఈ సమయంలో వ్యాక్సిన్ మాట అటుంచి ప్రస్తుతం వైరస్ బారిన పడిన వారు ప్రభావవంతమైన మందులు వాడడమే ఉత్తమమని శాస్త్రవేత్తలతో పాటు వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు.
ఇక కరోనా బారి నుంది తప్పించుకునేందుకు ఒక పూర్తి కోర్సు మందులు వాడేందుకు కనీసం 32 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని బయోకాన్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా వెల్లడించారు. ఆమె కంపెనీ నుండి తయారవుతున్న ‘ఇతోలిజుమాబ్’ అనే రకం మందు ఒక్క వయల్ (vial) యొక్క ధర సుమారు ఎనిమిది వేల రూపాయలు అని తెలిపారు. ఇక కనీసం 4 వయల్స్ ను ఒక కరోనా పేషెంట్ కు అవసరపడుతుంది కనుక 32 వేల రూపాయల వరకూ దీనిని ఖర్చు ఉంటుందని ఆమె చెప్పారు.
ఇక బయోకాన్ తయారు చేసిన ఈ మందుని కరోనా పేషెంట్లకు వాడేందుకు ప్రపంచంలోనే పర్మిషన్ మరి అప్రూవల్ సంపాదించిన మొట్టమొదటి బయోలాజికల్ డ్రగ్ ఈ ‘ఇతోలిజుమాబ్’ అని చెప్పిన ఆమె మిగతా మందులతో పోలిస్తే కరోనా పేషెంట్లు ను కాపాడేందుకు ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని వెల్లడించారు. అయితే కనీసం 32 వేల రూపాయలు చేతులు లేకపోతే కరోనా వైరస్ వల్ల తీవ్రంగా బాధపడుతున్నవారు ప్రాణాలు దక్కించుకోవడం కష్టమేనని ఫిక్స్ అయిపోవాలి అన్నమాట. ఇకపోతే ఈ మందును మన గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికి వాడుతున్నారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు కానీ ఇంత డబ్బులు పెట్టి కొని పేషెంట్లకు ఉచితంగా ప్రభుత్వాలు ఇచ్చేది అనుమానమే.