హలో అతన్ని ఎందుకు కొట్టారు.. నన్ను కామెంట్ చేస్తే మీకేంటంటా..? చూడండి ఇవన్నీ మీరు ఎందుకు చేస్తున్నారో నాకు తెలుసు..! ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకండి..? నిన్న డాష్ ఇచ్చారు.. ఇవాళ కామెంట్ చేస్తే కొట్టారు.. ఈవినింగ్ రెస్టారెంట్ కి రమ్మంటారు.. వస్తున్నావ్.. ఈవినింగ్ “కాఫీ డే” కి వస్తున్నావు.. హలో.. ఈవినింగ్ 6’o క్లాక్ ..హలో.. కాఫీ డే… దాదాపు నాలుగు దశాబ్దాలుగా భిన్న తరాలకు చెందిన లక్షలాదిమందికి మధురమైన క్షణాలను పంచుతూ, వారి జీవితాల్లో ఒక తీయని జ్ఞాపకంగా చెరగని ముద్ర వేసుకున్న సంస్థ ‘కెఫే కాఫీ డే’. కాపీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ నూతన సీఈవోగా ఆ సంస్థ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ వీజీ సిదార్థ సతీమణి మాళవిక హెగ్డే నియమితులయ్యారు.. పూర్తి సమాచారం ఇలా..
బెంగళూరు కేంద్రంగా కొనసాగుతున్న కేఫ్ కాఫీ డే దేశవ్యాప్తంగా వందలాది షాపులను నిర్వహిస్తోంది. ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద కాఫీ సంస్థ “కేఫ్ కాఫీ డే” గా పేరుగాంచింది.. విదేశాల్లో కూడా ఈ కంపెనీ కాఫీ షాపులు ఉన్నాయి. వేలాది మంది ఉద్యోగులు ఇందులో పనిచేస్తున్నారు. అయితే 2019 జూలైలో ఆ సంస్థ సీఈవో వీజీ సిదార్థ.. ఓ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.. అయితే సిదార్థ మరణం కంపెనీ భవిష్యత్తును అగాథం లోకి నెట్టివేసింది. ఆయన మరణించిన తర్వాత కాపీ డే ఇండిపెండెంట్ బోర్డు మెంబర్ ఎస్పీ రంగనాథ్ మధ్యంతర చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నారు. అయితే తాజాగా మాళవికను సీఈవోగా నియమిస్తున్నట్టు ఆ కపెంనీ స్టాక్ ఎక్స్చేంజీ ఫైలింగ్లో వెల్లడించింది. సుమారుగా 17 నెలల తర్వాత ఆ సంస్థ కొత్త సీఈవోగా మాళవిక నియమితురాలయ్యారు. అప్పుల్లో ఉన్న కాఫీ డే సంస్థను తిరిగి నిలబెట్టేందకు తాము కట్టుబడి ఉన్నట్టు ఆమె అన్నారు.మాళవిక హెగ్డే మాజీ కేంద్ర మంత్రి, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కుమార్తె అని పరిచయమే.
ఒకప్పుడు ‘కెఫే కాఫీ డే’లవంటి ఖరీదైన దుకాణాలకు వెళ్లడం తమ హోదాకు చిహ్నంగా భావించినవారు. అప్పట్లో కాఫీ గింజలను సేకరించడం.. వాటిని ప్రాసెసింగ్ చేయడం.. ఆపై విక్రయాలు జరపడం చేసేవారు. అలా అనతికాలంలోనే బ్రాండ్ వాల్యూ ఇంటర్నేషనల్ దాకా ఎదిగింది. తామున్న రంగంలో చిత్తశుద్ధితో, నిజాయితీతో పనిచేస్తూ సమున్నతంగా ఎదగడానికి శ్రమించేవారందరికీ ఇది వర్తిస్తుంది. సిద్దార్థ అటువంటివారు. ఆయన బాటలోనే ఇప్పుడు ఆమె నడవనున్నది..