Copper: మన శరీరానికి అవసరమైనంత నీటిని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంది ప్రతిరోజు కనీసం ఎనిమిది గ్లాసుల నీటిని తాగమని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.. నీటిని తాగడం వలన మనకు వచ్చే 50 శాతం రోగాలను నయం చేసుకోవచ్చు.. ఇప్పుడంటే నీటిని శుద్ధి చేయడానికి వాటర్ ఫిల్టర్లు, ఆర్వో ఫ్యూరీఫైయర్లు వాడుతున్నాం కానీ.. మన అమ్మమ్మ, తాతల కాలంలో మాత్రం రాగి బిందెలో నీటిని తాగే వారు.. రాగి రాగి బిందె లో నీళ్ళు నిల్వ చేసుకొని ఉదయం ఆ నీటిని తాగితే ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు చూద్దాం..
రాగి పాత్రలో నీరు తాగడం వలన కడుపులో మంట తగ్గుతుంది. అజీర్తి , అల్సర్, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పడటానికి నీరు సహాయపడతాయి. కాలేయం, కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి. రాగి చెంబు నీరు తాగడం వలన ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. త్వరగా బరువు తగ్గాలనుకొనే వారికి ఈ నీరు చక్కటి ప్రత్యామ్నాయంగా ఆరోగ్య నిపుణులు చెబుతా.రు ఈ నీరు పరగడుపున తాగడం వలన శరీరంలోని విష పదార్థాలను బయటకు నెట్టి వేస్తుంది.
రాగి చెంబులో నీటిని తాగటం వలన రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ఈ నీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరం లోని ఫ్రీరాడికల్స్ తో పోరాడి గుండె జబ్బులు రాకుండా చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. ఇంకా క్యాన్సర్ బారిన పడకుండా చేస్తాయి. ఈ నీరు థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది. వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తుంది.