Reddyvarri Nanu balu: మన చుట్టూ ఎన్నో మొక్కలు కనిపిస్తూ ఉంటాయి వాటిలో ఉన్న ఔషధ గుణాలు విలువ మనకు తెలియక వాటిని పిచ్చిమొక్కలు గా భావిస్తూ ఉంటాము.. అటువంటి కోవకు చెందిన మొక్కే రెడ్డివారినానుబాలు మొక్క..!! ఈ మొక్కలు బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి ఇవి అనేక ఆరోగ్య సమస్యలను నయం చేస్తాయి.. రెడ్డివారినానుబాలు మొక్క ఎటువంటి వ్యాధులకు చెక్ పెడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..!!
Reddyvarri Nanu balu: దృష్టి లోపంతో బాధపడుతున్న వారు ఇలా చేయండి..!!
ఈ మొక్కకు కంటి చూపు (Eye Sight) ను తెప్పించే శక్తి ఉంది.. ఈ మొక్కను రెడ్డివారినానుబాలు మొక్క, పాలకాడ, పచ్చ బొట్టు ఆకు, నాగార్జుని అని కూడా పిలుస్తారు. ఈ మొక్కను తుంచితే పాలు వస్తాయి. ఈ పాలను రెండు చుక్కలు కంట్లో వేసుకుంటే కంటి పొరలు, కంటి మసకలు (Eye Problems) పోతాయి. అంతేకాకుండా కంటి పుండ్లు కూడా తగ్గుతాయి. ఈ మొక్క దృష్టిని పెంచడానికి అద్భుతంగా సహాయపడుతుంది. అనుకోకుండా కంటి లో ఏవైనా గుచ్చుకొని రక్తం కారినప్పుడు మరలా కంటి చూపును తీసుకువచ్చే శక్తి ఈ మొక్కకి ఉంది.
ఈ మొక్క మొత్తం భాగాలన్ని దంచి రసం తీసుకోవాలి. ఈ రసంలో 9 మిరియాల పొడిని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మూడు రోజుల పాటు తాగితే రుతు సమయం (periods) లో వచ్చే అన్ని సమస్యలను తగ్గిస్తుంది. అధిక రక్తస్రావం, రుతు సమయంలో వచ్చే నొప్పులను తగ్గిస్తుంది. ఆడవారిలో గర్భాశయ దోషాలను తొలగిస్తుంది. ఈ మొక్క సమూలంగా తీసుకొని శుభ్రంగా కడిగి నీడలో ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడికి సమాన మోతాదు లో పటికబెల్లం కలిపి ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ పొడిని ఉదయం పరగడుపున ఒక గ్లాసు పాలలో ఒక స్పూన్ కలిపి తీసుకుంటే శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. వీర్య కణాలను వృద్ధి చేస్తుంది. ఈ చూర్ణం తీసుకోవటం వలన షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది.
పులిపిర్లు (Warts) ఉన్నచోట ఈ మొక్క ఆకులను తొందరగా వచ్చిన పాలను తీసుకొని పులిపిర్లు ఉన్నచోట రాస్తే అవి త్వరగా తగ్గిపోతాయి. ఇలా చేస్తే పులిపుర్లు త్వరగా రాలి పడిపోతాయి. ఈ చెట్టు పాలను పదవులపై రాసుకుంటే పెదవుల పగుళ్లు పోయి, పెదాలను మృదువుగా చేస్తుంది. శరీరంపై గాయాలు, పుండ్లు (Wounds) ఉన్నచోట ఈ పాలను రాస్తే త్వరగా మానిపోతాయి.
ఈ చెట్టు ఆకులను తులసి ఆకులను సమాన మోతాదులో చూసుకుని ముద్దగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేస్తే మొటిమలు (Pimples) వాటి తాలూకు మచ్చలను పోగొడుతుంది. రెడ్డివారినానుబాలు 5 మొక్క ల మొత్తం భాగాలను సేకరించి శుభ్రంగా కడుక్కోవాలి. ఒక లీటర్ నీటిలో వీటిని వేసి 10 నిమిషాలు మరిగించుకోవాలి. ఈ నీటిని ఒక సీసా లోకి వడపోసుకోవాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఈ నీటిని రోజు మొత్తం ఎక్కువ సార్లు తాగుతూ ఉంటే డెంగ్యూ ఫీవర్, వైరల్ ఫీవర్స్ (Viral Fever), మొండి జ్వరాలను తగ్గిస్తుంది. ఇలా తాగటం వలన రక్తకణాల సంఖ్య పెరుగుతుంది. శరీరం డీహైడ్రేషన్ కాకుండా చేస్తుంది. రక్త కణాలు పెరిగేలా చేస్తుంది.