Chiranjeevi: నిన్న జరిగిన “అలయ్ బలయ్” కార్యక్రమంలో చిరంజీవిపై గరికపాటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. తాను ప్రసంగిస్తున్న సమయంలో చిరంజీవి రావడం.. అదే సమయంలో సభకు వచ్చినవాళ్లు చిరంజీవితో సెల్ఫీలకు దిగడానికి పోటీ పడటం జరిగింది. వేదికపై తాను ప్రసంగిస్తున్న సమయంలోనే చిరంజీవి చుట్టూ జనం చేరడంతో గరికపాటి అసహనానికి లోనయ్యారు. వెంటనే చిరంజీవి ఫోటో సెషన్ ఆపితే గాని … తాను ప్రసంగించడం మొదలుపెట్టను అని లేకపోతే వెంటనే వెళ్ళిపోతానని గరికపాటి మైక్ లోనే కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో చిరంజీవిపై గరికపాటి చేసిన వ్యాఖ్యలు పెను దుమారాని రేపాయి.
మెగాస్టార్ అభిమానులు గరికపాటి పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఎంతోమంది అభిమానం సంపాదించుకున్న వ్యక్తిని వేదికపై అందరూ చూస్తుండగా గరికిపాటి లాంటి వాళ్లు ఆ రీతిగా అసహనంగా మాట్లాడటం దారుణమని అంటున్నారు. ఇక ఇదే విషయంపై మెగా బ్రదర్ నాగబాబు గరికపాటి పై సెటైర్ లు వేయడం తెలిసిందే. పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడు భవాని రవికుమార్… ఈ వివాదంపై గరికపాటితో ఫోన్ లో మాట్లాడారు.
చిరంజీవి పట్ల గరికపాటి వ్యవహరించిన వైనం అభిమానులకు ఎంతో బాధ కలిగించిందని ఫోన్ లో గరికపాటికి తెలియజేశారు. మీపై చాలామందికి ఆగ్రహం కలిగింది వారిని తామే శాంతింప చేసినట్లు స్పష్టం చేశారు. ఇక ఇదే సమయంలో ఎక్కడైనా మెగా అభిమానులు మీకు ఇబ్బంది కలిగించారని కూడా గరికపాటిని ప్రశ్నించారు. అందుకు గరికపాటి స్పందించి.. ఎవరూ కూడా తనని ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. చిరంజీవి ఎంతో సహృదయుడని ఈ విషయంపై నేరుగా ఆయనతోనే మాట్లాడతానని గరికపాటి వివరణ ఇచ్చారు. ఈ విషయాన్ని అభిమానులందరికీ తెలియజేయండి. ఇవ్వాలే తప్పకుండా ఆయనతో మాట్లాడతాను అంటూ చిరంజీవి రాష్ట్ర యువత అధ్యక్షుడితో గరికపాటి తెలియజేయడం జరిగింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!