నేరెడ్ మెట్ లో అదృశ్యమైన 12 ఏళ్ల బాలిక సుమేధ మరణించిన విషయం రెండు తెలుగు రాష్ట్రాల ను తీవ్రంగా కలిచివేసింది. హైదరాబాద్ లో తాజాగా కురిసిన భారీ వర్షాలకు సుమేధ…. నాలా లో పడి కొట్టుకు పోయిన సంగతి తెలిసిందే. చివరికి బండ చెరువు లో శవమై తేలిన సుమేధ నాలా లో పడి మరణించినట్లు చెబుతున్నారు.
హైదరాబాద్లోని కాకతీయ నగర్ లోని సుమేధ అనే ఒక బాలిక ఉంది. గురువారం నాడు సైకిల్ మీద బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళిన మీద ఎంత సేపటికీ తిరిగి రాలేదు. ఆమె ఇంటి నుండి బయటకు వెళ్ళిన కొద్ది సేపటికే అతి భారీ వర్షం కురిసింది. ఆమె బయటకు వెళ్లి పోయిన సమయంలో తల్లి, తండ్రి కనిపించని కూతురి కోసం గాలించింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు. వెతకగా బండ చెరువులో శవమై తేలింది.
దీంతో తల్లిదండ్రులు జిహెచ్ఎంసి నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ధ్వజ మెత్తారు. తమ కూతురు మరణించిన ఘటన పై తల్లిదండ్రులు తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరెడ్ మెట్ పోలీస్ స్టేషన్లో వారు…. మంత్రి కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు. అలాగే జిహెచ్ఎంసి కమిషనర్ జోనల్ కమిషనర్ మీద కూడా ఫిర్యాదు చేశాడు. దాంతో పాటు స్థానిక కార్పొరేటర్ మీద సంబంధిత డిఈ ల పై, ఏఈ ల పై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు వీరందరి పై 304 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని వారు కోరడం గమనార్హం.