Post Office: పోస్టాఫీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. పోస్టాఫీసు పథకాలు లో డిపాజిట్, రికరింగ్ డిపాజిట్లు, ఫిక్సిడ్ డిపాజిట్, సేవింగ్స్ ఖాతాలపై మంచి వడ్డీ ను అందిస్తోంది.. తాజాగా ఆర్థిక శాఖ పోస్టాఫీస్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ తెలిపింది.. మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది..
పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాలపై చార్జీలను తగ్గిస్తున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది.. మినిమమ్ బ్యాలెన్స్ లను సగానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. దీంతో పోస్టాఫీస్ మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలు రూ.50 కు తగ్గాయి. ఇంతకుముందు పోస్టాఫీస్ మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలు రూ.100 గా ఉండేది. పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ స్కీమ్ 2019 సవరణలు చేయడం ద్వారా చార్జీలు తగ్గిస్తామని ఆర్థిక శాఖ తెలిపింది. ఇటీవల ఎస్బిఐ మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలను మించడం లేదు. అంతకుముందు మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలు వసూలు చేసినప్పటికీ మార్చి 2020 నుంచి ఆ చార్జీలను తొలగించింది.