టాలీవుడ్ స్టార్ హీరోయిన్, డిల్లీ బేబీ డాల్ రకుల్ ప్రీత్ సింగ్ సుశాంత్ సింగ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా రకుల్ కి కూడా తన డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఎన్సీబీ వారి ముందు వెల్లడించినట్లు మీడియాలో కథనాలు జోరందుకున్నాయి.
అయితే యువ హీరో సుశాంత్ సింగ్ అనుమానాస్పద మరణం కేసులో ఈ వ్యవహారం బయటకు రాగా…. ఈ కేసులో రంగంలోకి దిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ముందు రియా పలువురు సినీ ప్రముఖుల పేర్లు వెల్లడించిందని…. వారిలో రకుల్ తో పాటు సారా అలీ ఖాన్ కూడా ఉన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు రకుల్…. కేసుకు సంబంధించి మీడియాలో తనపై వస్తున్న కథనాలను నిలిపివేయాలని కోరుతూ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది.
సోషల్ మీడియాలో సైతం రకుల్ కి వ్యతిరేకంగా పోస్ట్ లు పెడుతూ విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రచార మాధ్యమాల్లో వస్తున్న కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన రకుల్ ప్రీత్ మాదకద్రవ్యాల కేసుకు సంబంధించి ఎటువంటి వార్తలు మీడియాలో ప్రసారం చేయకుండా సమాచార శాఖ ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన జస్టిస్ చావ్లా ధర్మాసనం మీడియా ప్రసారాలపై సుప్రీంకోర్టు ఇప్పటికే స్పందించిందని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు.. మీడియా సంస్థలు స్వీయ నియంత్రణ పాటించాలి అని సూచిస్తూ…. పిటిషన్ ను ఫిర్యాదు గా పరిగణించి ఆయా శాఖలు అందుకు తగ్గ చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. పాపం దక్షిణ చిత్ర పరిశ్రమలో కొంతకాలం స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన రకుల్ చివరికి మీడియా కథనాలు ఆపించడం కోసం ఎంత దూరం వెళ్లిందో చూడండి.