వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీరుపై విమర్శలు గుప్పించారు. విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఏపీలో మీడియాపై హైకోర్టు ఆంక్షలు విధించిన అంశాన్ని ప్రస్తావించారు. మాజీ అడ్వకేట్ జనరల్ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్పై దాఖలైన ఎఫ్ఐఆర్ను మీడియాలో, సోషల్ మీడియాలో రిపోర్టు చేయవద్దంటూ ఏపీ హైకోర్టు ఆదేశించిన సంగతి తెల్సిందే.
ఈ విషయాన్ని గుర్తుచేస్తూ హైకోర్టు అసాధారణ చర్యలకు దిగుతోందని విమర్శించారు. ఈ తరహా చర్యలను సమర్ధించుకోవడానికి వారికి ఏ ఆధారమూ లేదని గుర్తుచేసిన ఆయన బ్రిటీషు వారి తరహాలో వ్యవహరిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ తప్పులకే ఇలా హైకోర్టు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం కరోనా, ఆర్ధిక ఇబ్బందులతో పాటు న్యాయవ్యవస్థపై పోరాటం చేయాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు.