SBI Alert: దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఎస్బిఐ కస్టమర్లకు అలర్ట్.. ఎస్బిఐ ఎప్పటికప్పుడు తన కస్టమర్లను అప్రమత్తం చేస్తూ ఉంటుంది.. తాజాగా ఎస్బిఐ ఆన్లైన్ సేవలకు వరసగా మూడు రోజులపాటు అంతరాయం కలగనుందని తెలిపింది..
మే 21, 22, 23 రోజులలో మెయింటినెన్స్ కారణంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్, yono, yono lite, యూపీఐ వంటి సేవలు అందుబాటులో ఉండవని ఎస్బిఐ తెలిపింది. మే 21న 22:45 గంటల నుంచి మే 22న 1:15 గంటల వరకు.. అలాగే మే 23న 2:40 గంటల నుంచి 6:10 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది.. మిగతా సమయాల్లో యధావిధిగా కొనసాగుతాయని..ఆ టైమ్ చూసుకోని ముందుగా జాగ్రత్త పడవల్సిందిగా ఎస్బిఐ తన కస్టమర్స్ కి సూచించింది.. UPI పేమెంట్స్ వినియోగదారులకు ఈ 3 రోజులు అంతరాయం కలగనుంది.