Sonu Sood: మహమ్మారి కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చిన తరువాత దేశంలో లాక్ డౌన్ ఎప్పుడైతే అమలు అయ్యిందో అప్పటి నుండి సోనూసూద్ పేరు మారుమ్రోగుతోంది. లాక్ డౌన్ సమయంలో అనేకమంది వలసకూలీల సొంత డబ్బుతో స్వస్థలాలకు చేర్చిన సోనుసూద్ తర్వాత అనేకమందిని ఆదుకుంటూ వస్తున్నారు. దేశంలో అనేకమంది పేదవాళ్లకు చదువును స్కాలర్షిప్ల ద్వారా చెప్పిస్తూ.. పేద విద్యార్థులకు కుటుంబాలకు అండగా ఉంటూ మరోపక్క ఉపాధి లేని వారికి ఉద్యోగం కల్పిస్తూ ఉన్నాడు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండటంతో.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏం చేయలేని పరిస్థితిలో వైద్యం అందక చాలామంది ప్రాణాలు కోల్పోయే పరిణామాలు దారితీస్తూ ఉండటంతో సోనూసూద్ టీం అలర్ట్ అవుతూ రాత్రింబవళ్ళు కష్టపడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల బెంగళూరు లో ఆర్క్ హాస్పిటల్ లో ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో వెంటనే.. విషయం తెలుసుకున్న సోనూసూద్ వెంటనే తన బృందాలను పంపించి 22 మంది ప్రాణాలను కాపాడటం జరిగింది.
దాదాపు గంటల వ్యవధిలో పదిహేను ఆక్సిజన్ సిలిండర్ అందించి వారి ప్రాణాలను కాపాడాడు. తాజాగా ఈ విషయం సోషల్ మీడియాలో తెలియజేసి.. హుటాహుటిన బయలుదేరి తన టీం సభ్యులను సోను సూద్ అభినందించారు. ఇటువంటి కష్ట కాలం లో ప్రభుత్వాలు మరియు సొంత కుటుంబ సభ్యులు కరోనా రోగులను పట్టించుకోని పరిస్థితి ఉన్న టైంలో సోనూసూద్ చేస్తున్న సేవల పట్ల.. కరోనా రోగులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.