Today Gold Rate: (19/5/2021) పసిడి ప్రియులకు అలర్ట్.. వరుసగా 4 రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు కూడా అదే బాట పయనించాయి.. బంగారం ధర భగ్గుమంటుంది.. పసిడి ధర ఆకాశాన్ని చూస్తుంది.. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బ్యాడ్ న్యూస్ గా చెప్పవచ్చు.. ఒకవైపు బంగారం ధరలు పెరిగితే.. మరోవైపు వెండి కూడా అదే బాట పయనించింది.. ఈరోజు వెండి ధర అమాంతం పైపైకి కదిలింది.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఈవిధంగా ఉన్నాయి..
బుధవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు కి రూ.300 పెరిగి రూ.45,450 కి ఎగసింది.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు కి రూ.330 పెరిగింది.. దీంతో ఈ రోజు ధర రూ.49,590 కి పెరిగి 50 వేలకు చేరువలో ఉంది.. ఏప్రిల్ 1 కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైనప్పటి నుంచి బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయి.. అలాగే మే 1 నుంచి 19వ తేదీ వరకు ఒకసారి బంగారం ధరలు పరిశీలించుకుంటే.. ఇప్పటివరకు 13 సార్లు బంగారం ధరలు పెరిగాయి.. 3 సార్లు బంగారం ధరలు తగ్గాయి.. 3 సార్లు స్థిరంగా ఉన్నాయి.. అంటే బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి.. మరో 3 నెలల పాటు ఇదే ట్రెండ్ కొనసాగుతుందని దేశీయ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.. ఈరోజు వెండి ధర జిగేల్ మంటుంది.. ఈరోజు వెండి ధర నిన్నటి ధరకి ఏకంగా రూ.1700 పెరిగింది.. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ. 78,500 కి అమాంతం పెరిగిపోయింది.