Viral News: వైద్యులు ప్రాణం పోస్తారు.. ప్రాణాలు సింపుల్ గా తీసేస్తారు కూడా..! అందుకే వైద్యో నారాయణో హరీ అంటారు. వైద్య విధానంలో శస్త్ర చికిత్స చాలా కీలకం, సున్నితమైనది. అప్పుడప్పుడు ఆపేరేషన్ చేసే సమయాల్లో ఆ పొట్టలో, శరీర భాగాల్లోపల కత్తిరి, పరికరాలు, బ్లేడులు, దూది మర్చిపోయి కుట్టేస్తుంటారు. దీంతో ఆ పేషేంట్లు మరణిస్తుంటారు. అటువంటి ఘటనే యాదాద్రి భువనగిరిలో ఈ రోజు జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళ నిండు ప్రాణాలను బలిగొన్నది. ఏడాది పాపను అనాథ చేసింది. ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. అదే జిల్లాలోని రాయగిరి గ్రామానికి చెందిన ఓ గర్భిణి ఏడాది కిందట కాన్పు కోసమని భువనగిరిలోని కేకే ఆస్పత్రిలో చేరింది. అక్కడి వైద్యులు ఆమెకు సర్జరీ నిర్వహించి ప్రసవం చేసారు. అంతా బాగానే ఉంది. పాప పుట్టింది, పెరిగి పెద్దదయింది. ఏడాది పాప.. అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. అయితే క్రమేణా ఆ మహిళకు కడుపు నొప్పి వస్తుంది. ఎక్కువవుతుంది. దీంతో ఆమె హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చూపించుకున్నారు. స్కానింగ్ ద్వారా కడుపులో దూది ఉన్నట్టు గుర్తించారు. ఏడాది కాలంగా ఆమె కడుపులో దూది ఉన్నట్టు.., రక్షంలో కలిసిపోతున్నట్టు గుర్తించారు. వెంటనే తొలగించాలని లేకుంటే మరణిస్తుంది తేల్చారు.
Viral News: అన్ని ఏర్పాట్లు చేస్తుండగానే..!!
ఏడాది కిందట ఈ ఘటనకు కారణమైన భువనగిరి కేకే ఆసుపత్రికి మహిళా బంధువులు వెళ్లి విషయం చెప్పారు. వైద్యుల నిర్లక్ష్యం వలన మహిళా ఆరోగ్యం దెబ్బతింది అంటూ ఆసుపత్రి యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ఆమె ఆపేరేషన్ కి ఏర్పాట్లు చేస్తుండగానే.. పేగుల్లోకి దూది దూరి, పేగులన్నీ కుళ్ళి ఆమె రక్త ప్రసరణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని ఈరోజు మరణించారు. దీంతో ఆమె మృతదేహంతో మహిళ కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నాకి దిగారు. భువనగిరి కేకే ఆస్పత్రి ఎదుట మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. మహిళ మృతికి ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ధర్నాకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* 2020 జనవరిలో ఇదే తరహా ఘటన తమిళనాడులో జరిగింది. ఆ మహిళా మరణించింది. 2018లో హైదరాబాద్ లోనూ జరిగి, ఓ గర్భిణీ మరణించింది.