టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి క్రేజ్ ఉన్న అనుష్క శెట్టి ఇక సినిమాలకి గుడ్ బాయ్ చెప్పబోతుందన్న వార్త ఈ మధ్య బాగా ప్రచారం అవుతోంది. వాస్తవంగా తన నుంచి సినిమాలు రాకపోవడానికే ఇందుకు ప్రధాన కారణం. అదీకాక గత కొంతకాలంగా రేస్ లో బాగా వెనకబడింది అనుష్క. భాగమతి సినిమా తర్వాత మళ్ళీ దాదాపు రెండేళ్ళ గ్యాప్ తీసుకుని కోన వెంకట్ నిర్మాణంలో రూపొందిన నిశబ్ధం సినిమాలో ఒక ఛాలెంజింగ్ రోల్ చేసింది. ఈ సినిమా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషల్లో రిలీజ్ కి సిద్దంగా ఉంది. అయితే ఈ సినిమా గనక హిట్ అయితే వరసగా సినిమాలు చేయాలనుకుందట అనుష్క. కాని ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ తో థియోటర్స్ మూత పడే సరికి రిలీజ్ చేయలేదు. దాంతో నెక్స్ట్ సినిమా గురించి ఆలోచించడం లేదని వార్తలు వచ్చాయి. అదీకాక దర్శకుడు తేజ ఒక సినిమా కోసం సంప్రదిస్తే ఒప్పుకోలేదన్న టాక్ కూడా ఉంది.
ఇక నిశబ్ధం సినిమాని చాలాసార్లు ఓటీటీలో రిలీజ్ చేస్తారని టాక్ రావడంతో కోన వెంకట్ క్లారిటీ ఇస్తూ థియోటర్స్ లోనే మా సినిమాని రిలీజ్ చేస్తామని వెల్లడించాడు. ఈ సినిమా రిలీజయ్యాక రిజల్ట్ ని నెక్స్ట్ సినిమా కమిటవ్వాలా లేదా అన్న డైలమాలో అనుష్క ఉందట. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఒక తమిళ సూపర్ హిట్ సినిమా సీక్వెల లో అనుష్క నటించబోతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. అది కూడా లోకనాయకుడు కమల్ హాసన్, గౌతం మీనన్ కాంబినేషన్ లో రూపొందనున్న క్రేజీ ప్రాజెక్ట్ అని తెలుస్తుంది.
గతంలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతం మీనన్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన వేట్టైయాడు వేళైయాడు సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగులో ఈ సినిమా రాఘవన్ పేరుతో విడుదలై మంచి వసూళ్ళు రాబట్టింది. క్రైమ్ థ్రిల్లర్ బ్యాగ్డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ గా వేట్టైయాడు వేళైయాడు 2 ని రూపొందించాలని దర్శకుడు గౌతం మీనన్ సన్నాహాలు చేస్తున్నాడట. ఈ సూపర్ హిట్ సీక్వెల్ కోసం అనుష్క ని సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. నిశబ్ధం లో మూగ, చెవిటి యువతిగా ఒక కొత్త పాత్రలో కనిపించబోతున్న అనుష్క సినిమాలు మానేస్తుందన్న వార్త కి తాజాగా కమిటయిన ఈ కోలీవుడ్ సినిమాతో చెక్ పెట్టినట్టే అని తెలుస్తుంది.