మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్ ను పొడిగిస్తూ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేసింది. మోకా భాస్కరరావు హత్యకేసులో కొల్లు రవీంద్ర అరెస్టైన విషయం తెల్సిందే. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మేజిస్ట్రేట్ ఈదుట కొల్లు రవీంద్రను హాజరుపరచగా మేజిస్ట్రేట్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వలు ఇచ్చింది.
ఇప్పటికే రవీంద్ర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెల్సిందే. బెయిల్ పిటీషన్ విచారణను 20న నిర్వహించనున్నారు. మంత్రి పేర్ని నానీ ప్రధాన అనుచరుడు ,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,మచిలీపట్నం మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు అయిన మోకా భాస్కరరావు హత్యకేసులో పోలీసులు కొల్లు రవీంద్రను మఫ్టీలో పోలీసులు తుని వద్ద కాపు కాసి అరెస్ట్ చేసారు. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసారు.