‘అమరావతిలోనే రాజధాని.. మూడు రాజధానుల నిర్ణయం సరైంది కాదు..’ ఈ హెడ్ లైన్స్ చూసిన ఎవరికైనా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అప్పుడే అమరావతికి మద్దతిస్తున్నట్టు, మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు భావిస్తారు. అదేమిటి.. కన్నా కూడా అదే మాట్లాడారు? బీజేపీ అందుకే కదా కన్నా పోస్టు పీకేసింది. అదే స్థాయిలో సోము వీర్రాజు కూడా మాట్లాడుతున్నారు.. అంటే ఈయన కూడా అమరావతి జేఏసీకి మద్దతు పలికుతున్నారా? బీజేపీ స్టాండ్ రాజధాని అమరావతి అనేనా?.. అనే అనుమానాలు కలుగాతాయి. ఇవన్నీ ఈరోజు ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో వచ్చిన వార్త. మ్యాటర్ చదవకుండా కేవలం హెడ్డింగ్ మాత్రమే చదివితే సోము వీర్రాజు ఉద్దేశం కూడా అమారావతికి జై అని.. మూడు రాజధానులకు వ్యతిరేకమని.. అనిపిస్తుంది. కానీ.. ఏబీఎన్ రాధకృష్ణ అసలైన తెలివి, అసలైన తిక్క.. అసలైన భజన జర్నలిజం.
జేఏసీకి సోము వీర్రాజు చెప్పారట.. ఆంధ్రజ్యోతిలో రాసారట..!
తీరా వార్త తెరిచి చూస్తే సోము వీర్రాజు అమరావతికి అనుకూలమని,, మూడు రాజధానులకు వ్యతిరేకమని ఆంధ్రజ్యోతికి చెప్పినట్టు ఆ పేపర్లో రాశారు. అమరావతి జేఏసీకి ఏ రాజకీయ పార్టీ తమ మద్దతు పలకాలన్నా ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకుంటే ఏ ప్రాంతం వారికి దూరమవుతామో అనే సున్నితమైన అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే జాగ్రత్తగా వ్యవహిరంచాల్సి వస్తుంది. సోము వీర్రాజు కూడా అమరావతిపై తన స్టాండ్ ఏంటో నిర్ణయం వెల్లడించలేదు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే నడుచుకుంటామని అన్నారు. కానీ.. అమరావాతి జఏసీ నేతలకు సోము వీర్రాజు అమరావతికే జై అని వారి చెవిలో చెప్పినట్టు.. వారు వచ్చి రాధాకృష్ణ చెవిలో చెప్పినట్టు తమ పత్రికలో మొదటి పేజీలో వేసేశారు. అందుకే.. ఇక్కడ అర్ధం చేసుకోవాల్సింది ఏంటంటే అమరావతి రాజధానిగా కావాల్సింది జేసేసీకి, ఆంధ్రజ్యోతికి మాత్రమే కావాలి. వీరిద్దరి ఉద్దేశాల్ని సోము వీర్రాజు మీదకు నెట్టేసి ఆంధ్రజ్యోతిలో వార్త రాసేశారు.
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!