అందుకే సోమూ చిరును కలిశారా…
ఆయన మెగాస్టార్ చిరంజీవీ… ఈయన ఏపీ బీజేపీ ఫైర్ బ్రాండ్ సోము వీర్రాజు… ఇద్దరూ కలవడం… మాట్లాడుకోవడం మాములుగా అయితే సాధారణమే… ఏపీ బీజేపీ చీఫ్ గా పగ్గాలు తీసుకున్నాక సోము.. పార్టీని ఎలా బలోపేతం చేయాలన్నదానిపై ఓ రేంజ్ లో ఆలోచిస్తున్నారట. ఆయన ఇప్పటికే చాలా మంది ప్రముఖలతో మాట్లాడారట. పార్టీలోకి ఎవరొస్తే బాగుంటుంది. పార్టీని ఎలా బలోపేతం చేయాలన్న దానిపై కీలక చర్చలు జరుపుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయ్. తనకు ఢిల్లీలో పరపతి పెరగాలంటే… ఏపీలో ఎవరెవరు పార్టీలోకి వస్తారన్నదానిపై ఆధారపడి ఉంటుందన్న వర్షన్ కూడా ఉంది. అందుకే ఇప్పుడు సోము… చిరంజీవిని కలిశారట…
రాజకీయాలకు దూరంగా చిరు
మెగాస్టార్ చిరంజీవి గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశాక… కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్ గా లేరు. సినిమానే లోకంగా భావిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ… రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో ఆయన కలివిడిగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ మంచి జరిగినా… ఆ అంశాన్ని స్వాగతిస్తూ… సినీ ఇండస్ట్రీకి కుడిభుజంగా మారారు. మొత్తంగా చిరంజీవి రాజకీయంగా కొంచెం టచ్ మీ నాట్ గా ఉన్నారు. అయితే ఇప్పుడు సోము వీర్రాజు… చిరంజీవిని కలవడం వెనుక ఏదైనా వ్యూహముందా అన్న చర్చ మొదలయ్యింది.
గతంలోనూ చిరుతో బీజేపీ సంప్రదింపులు
చిరంజీవి గతంలోనే బీజేపీలో చేరతారంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే ఆయన ఎప్పుడూ దానిపై క్లారిటీ ఇవ్వలేదు. అంతెందుకు.. ఇటీవల వైసీపీ రాజ్యసభ సభ్యుల జాబితాలో చిరంజీవి కూడా ఉంటారన్న ప్రచారం జరిగింది.
ఏపీలో కాపు సామాజికవర్గానికి ప్రాధాన్యత కల్పించే వ్యూహం జగన్మోహన్ రెడ్డి చేశారని కూడా వార్తలు వచ్చాయ్. అయితే అటు వైసీపీ గానీ, ఇటు చిరంజీవి గానీ ఈ వార్తలపై పెద్దగా స్పందించలేదు. ఐయితే… చిరంజీవిని ఇప్పుడు బీజేపీ ఏపీ చీఫ్ ఇంటికి వెళ్ల కలవడం వెనుక జాయినింగ్ వార్తలు ఏమైనా ఉన్నాయా… రాజ్యసభ ఆఫర్ ఏమైనా ఉంటుందా.. అని చర్చ మొదలయ్యింది. అంటే చిరంజీవికి బీజేపీ గాలం వేస్తోందన్నమాట. అది కూడా ఆయనకు అత్యంత పరిచయం ఉన్న సోము వీర్రాజు ద్వారా.. వీర్రాజు ఇక కానివ్వండి.. చిరు కమలం తీర్థం పుచ్చుకుంటే మీరు గారెల బుట్టలో పడ్డట్టే…