భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాల అంటే మోడీకి చిన్నచూపు అని అందరూ ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారు. కాంగ్రెస్ లాగా మోదీ దక్షిణాది రాష్ట్ర రాజకీయాల పై ఆధారపడే వ్యక్తి కాద..ని ఉత్తరాదిన తనకు వీలైనంతగా బలపడి ఆ తర్వాతే దక్షిణాది వైపు చూస్తారని ఎప్పటినుండో విమర్శలు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఏ రోజూ బిజెపి తన ఉనికిని చాటుకున్నది లేదు. ఆ పార్టీతో…. ఈ పార్టీతో జత కట్టడం తప్ప ఒంటరిగా మైలేజీ పెంచుకునే ధైర్యం బిజెపికి లేవు అన్నది అందరికీ తెలిసిందే.
అయితే ఇలాంటి సమయంలో ఏపీ రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలైన వైసిపి మరియు బిజెపి మోడీ కి మాత్రం అమితమైన గౌరవం ఇస్తున్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు తాను మోడీ తో టచ్ లో ఉన్నానని అని ప్రచారం చేసుకుంటుంటే…. వైసిపి వాళ్ళు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని మరియు తీసుకున్న నిర్ణయాన్ని మోడీకి అప్ డేట్ చేస్తున్నామని అంటున్నారు. అయితే పైకి ఇలా కనపడుతున్నా…. లోపల మాత్రం మిగతా దక్షిణ భారతదేశ రాష్ట్రాల కు మోడీ గురించి చెడుగా చెబుతున్నారు అన్నది ఇప్పుడు బయటకు వస్తున్న విషయం.
పైకేమో మోడీ అండ లేకపోతే తాము ఉండలేము అన్నట్లు బిల్డప్ ఇస్తూ లోపల మాత్రం తమ రాష్ట్రానికి చెందిన జిఎస్టి డబ్బులు తీసుకుని వాళ్లకు అనుకూలమైన ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల ఇస్తున్నాడని మరియు ఏపీ విభజన బిల్లులో ఇచ్చిన హామీలు ఏవి మోడీ సర్కారు నెరవేర్చలేదని…. వారు కేంద్రంలో ఉంటే మిగతా రాష్ట్రాలకు కూడా ఇదే గతి పడుతుందని ప్రచారం చేస్తూ.. ఏపీ లో బిజేపి ని ఎదగనివ్వకుండా.. మిగతా రాష్టాల్లో చెడ్డ పేరుని తెస్తున్నారు.
అంతేకాకుండా పైకేమో ఏపీ లో ఉన్న రెండు పార్టీలు మోడీకి సాష్టాంగ నమస్కారం పెట్టడానికి ఎప్పుడు రెడీగా ఉన్నట్లు చూపిస్తూ…. లోపల మాత్రం లోటు బడ్జెట్ తో విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి బడ్జెట్ కోసం కనీస నిధులు…. కేంద్రం కేటాయించలేదని గొణుక్కుంటూ మొత్తం మీద మోడీ అసలు దక్షిణాదిలో తన కాలు పెట్టడానికి కూడా భయపడేలా పరిస్థితిని మార్చేస్తున్నారట. మరి మోడీ వీరిని ఎలా ఎదుర్కొంటాడు అనేది చూడాలి.