‘ముదురు’ సినిమా హీరోయిన్ కస్తూరి ప్రస్తుతం పెళ్లి చేసుకుని తన ఫ్యామిలీతో చెన్నై లో ఉంటోంది. అప్పట్లో నాగార్జున…. ఇప్పుడు విజయ్ దేవరకొండ లను తన క్రష్ లు అని చెప్పిన కస్తూరి తాజాగా ఈ టీవీ లో ప్రసారం అయ్యే అలీ టాక్ షో లో కొన్ని సంచలన విషయాలు వెల్లడించింది. అన్నమయ్య చిత్రం షూటింగ్ సమయంలో నాగార్జున తన అనుభవాలు పంచుకున్న ఆమె గతంలో తాను చేసిన ఒక వివాదాస్పద ఫోటోషూట్ పై స్పందించింది.
పెళ్లి చేసుకుని చక్కగా బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో కస్తూరి ఒక చిన్న బిడ్డ తో కలిసి న్యూడ్ గా అంటే ఒంటి మీద బట్టలు లేకుండా ఒక ఫోటో షూట్ చేసింది. అప్పట్లో ఆ విషయం ఎంతో పెద్ద రచ్చ అయింది. ఇండస్ట్రీ వర్గాలు మొత్తం దాని గురించి కొద్ది రోజులు చర్చలు కొనసాగించాయి. ఒక దక్షిణాది హీరోయిన్ ఆ స్థాయిలో బట్టలు లేకుండా ఫోటో షూట్ చేయడం ఒక ఎత్తు అయితే అందులోనూ ఒక పసిబిడ్డని ఎత్తుకొని అలా ఫోజులు ఇవ్వడం మరొక ఎత్తు. దీంతో ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పెద్దగా ఎక్స్పోజింగ్ చేయని హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ ఉన్న కస్తూరి ఇలా చేయడం ఏమిటి అని చాలామంది ముక్కున వేలేసుకున్నారు.
దీనిపై స్పందించని కస్తూరి ఇప్పుడు సమాధానం చెప్పింది. తల్లి పాల ప్రాముఖ్యత అవగాహన కల్పించేందుకే ఆ ఫోటో షూట్ చేసినట్లు వెల్లడించిన ఆమె అది ఒక మ్యాగజైన్ కోసం చేశామని… ఆ ఫోటో షూట్ విదేశాల్లో షూట్ చేయగా ఇండియా వరకు వచ్చేసిందని అన్నారు. ఆ ఫోటోలో తాను ఎలాంటి తప్పు చేయకపోయినా భారతీయులంతా ఇష్టం వచ్చినట్లు ఆమెని ట్రోల్ చేశారని ఇప్పుడు వాపోయారు.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!