కింగ్ నాగార్జున హొస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 అట్టహాసంగా మొదలైన సంగతి తెలిసిందే. ప్రోమోలతో ప్రేక్షకులలో విపరీతమైన బజ్ క్రియోటయింది. అయితే మొదటి ఎపిసోడ్ తప్ప మిగతావన్ని చప్పగా సాగుతున్నాయన్న టాక్ వినిపిస్తుంది. ఆ మొదటి ఎపిసోడ్ కూడా నాగార్జున డ్యూయల్ రోల్ లో తన మార్క్ స్టైల్లో ఎంటర్టైన్ చేశారు కాబట్టి ఆ మాత్రం రేటింగ్ వచ్చింది. ఇక ఈసారి బిగ్ బాస్ 4 ఎదుర్కొంటున్న అతి పెద్ద నెగిటివ్ కామెంట్స్ కంటెస్టెంట్స్ విషయంలో.
సరైన కంటెస్టెంట్స్ లేరన్న టాక్ మొదటి ఎపిసోడ్ నుంచే స్ప్రెడ్ అయింది. ఇక మొదటి వారం పూర్తి అయిన తర్వాత ఇంట్లోకి కమెడియన్ కుమార్ సాయిని వైల్డ్ కార్డ్ ద్వారా పంపించిన విషయం తెల్సిందే. షో లో కమెడియన్స్ లేరు అనే లోటు కనిపిస్తుందన్న ఉద్దేశ్యంతో అతడిని పంపిస్తే ఇంట్లో వారు అతన్ని కాస్త కూడా పట్టించుకోవడం లేదని అంటున్నారు. గత ఎపిసోడ్ లో లాస్య, సుజాత మాట్లాడుకుంటూ అతన్ని మనం దూరం పెడుతున్నామా అనుకున్నారు. వారం లేట్ గా అది కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంట్లోకి వచ్చాడు కాబట్టే అందరూ అతన్ని దూరం పెడుతున్నారేమో అన్న మాట వినిపిస్తుంది.
మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీకే ఇంటి సభ్యుల నుంచి సరైన రెస్పాన్ లేదు. పైగా అతని వల్ల పెద్ద ఉపయోగము అనిపించడం లేదు. ఇలాంటి సమయంలో మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ మరొకరిని ఇంటిలోకి పంపబోతున్నారట. ఇందుకు సంబంధించి తాజా ప్రోమోలో క్లూ ఇచ్చారు. కాకపోతే ఆ వ్యక్తి ఎవరన్నది మాత్రం క్లారిటీ రాలేదు. అయితే జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ అన్న టాక్ ఉంది.
ఏదేమైనా సీజన్ మొత్తం నాగార్జున భుజాల మీదే ఉందే, వారం మొత్తంలో రెండు రోజులు నాగార్జున వచ్చి మిగతా అన్ని రోజులని బ్యాలెన్స్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇది నిజం కూడా నాగార్జున ఉన్న ఎపిసోడ్స్ తప్ప మిగతా ఎపిసోడ్స్ లో పస లేక చప్పగా సాగుతుందని చెప్పుకుంటున్నారు.