NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

క‌రోనా వైర‌స్… జ‌గ‌న్ పై ఆ మ‌చ్చ పోతుందా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ‌త కొద్దికాలంగా ఇరుకున ప‌డ్డ అంశాల్లో క‌రోనా మ‌హ‌మ్మారి ఏపీలో విస్త‌రించిన తీరు ఒక‌టి. వాస్త‌వంగా ప్ర‌భుత్వం నిర్ణ‌యం మేలు చేసేదే అయిన‌ప్ప‌టికీ దాన్ని అన్వ‌యించుకున్న తీరుతో స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ని కొంద‌రు చెప్తుంటారు.

 

కరోనా వైరస్ విష‌యంలో ముందుగా చేయాల్సింది. ఎవరికైతే ఈ వైర‌స్ సోకిందో వారిని గుర్తించి మిగతా వారి నుంచి వేరు చేసి, ట్రీట్మెంట్ చేయాలి, రోగ నివార‌ణ చేయాలి. వీట‌న్నింటికీ మూలం కరోనా టెస్టులు చేయించుకోవడం. ఏపీ ప్ర‌భుత్వం దీన్ని గుర్తించి పెద్ద ఎత్తున టెస్టులు చేయించింది. దీంతో స‌హ‌జంగానే రోగ ల‌క్ష‌ణాలు ఉన్న వారి సంఖ్య పెద్ద ఎత్తున న‌మోదు అయింది. అయితే, దానిపై విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయి. అలాగే ఏపీ ప్ర‌భుత్వం తీరును ప‌లువురు అభినందించారు కూడా. కాగా, క‌రోనా విష‌యంలో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

ఒక్క రోజులో ఏపీలో ఏం జ‌రుగుతోందంటే…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కోవిడ్ మ‌హమ్మారి గురించి సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజుకు 70 వేల టెస్టులు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో కోవిడ్‌ బాగా తగ్గుమఖం పడుతోందని తెలిపారు. వారం క్రితం 5.5 ఉండే పాజిటివిటీ రేటు ప్రస్తుతం 4.76గా ఉందని అన్నారు. 104 కు డయల్‌ చేస్తే కచ్చితంగా అర్ధగంటలో బెడ్‌ అలాట్‌ చేసి, చికిత్స అందించాల‌ని స్ప‌ష్టం చేశారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఆసుపత్రిలో జాగ్రతలు తీసుకోవాలని ఆయన అన్నారు.

కరోనా వ‌చ్చి త‌గ్గిన వారి సంగ‌తి ఏంటి?

క‌రోనా నుంచి కోలుకున్న వారి విష‌యంలో సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. 10 శాతం కేసుల్లో కోవిడ్‌ వచ్చివెళ్లిన తర్వాత కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సర్వేలో తేలిందని సీఎం జ‌గ‌న్‌ అన్నారు. కోవిడ్ తగ్గాక కిడ్నీ సమస్యలు, హార్ట్, చెవుడు వంటి సమస్యలు కూడా వస్తున్నాయని ఆయన అన్నారు. కోవిడ్‌ వచ్చిన తర్వాత 6 నుంచి 8 వారాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని వారికి గుర్తు చేయాలని ఆయన అధికారులని ఆదేశించారు. ఇటువంటి కేసులను కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకురావాలని హెల్త్‌ సెక్రటరీకి ఆదేశాలు ఇస్తున్నామని ఆయన అన్నారు. వైద్యులు సరిపడా ఉన్నారా… మౌలిక సదుపాయాలు సరిగా ఉన్నాయా లేదా చూసుకోవాలని అయన ఆదేశించారు.

ఆరోగ్య శ్రీ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం

ప్రతి ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో కూడా హెల్ప్‌ డెస్క్‌ తప్పనిసరిగా ఉండాల‌ని సీఎం జ‌గ‌న్ ఆదేశించారు. రానున్న 15 రోజుల్లో ప్రతి ఆస్పత్రిలో ఉండాలని అన్నారు. హెల్త్‌ సెక్రటరీ దీన్ని మానిటరింగ్‌ చేయడంతో పాటు జాయింట్‌ కలెక్టర్‌ కూడా ధ్యాస పెట్టాలని జగన్ ఆదేశించారు. ఆరోగ్యమిత్రకు సరైన ఓరియంటేషన్‌ ఉండాలి. శిక్షణ ఉండాలని ఆయన అన్నారు. 104 కాల్‌ సెంటర్‌పైనా మాస్క్‌లపైనా సోషల్‌ డిస్టెన్స్‌పైనా హేండ్‌ శానిటైజేషన్‌ పైనా అవగాహన చాలా అవసరమని జగన్ అన్నారు. వైద్యుల, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటడం వంటి నాలుగు అంశాలపై ఫీడ్‌ బ్యాక్‌ ఉండాలని సీఎం జ‌గ‌న్ కోరారు.

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju