తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించారు. 5.25 శాతం మేర డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది జూలై మాసం నుంచి రావాల్సిన డీఏను వెంటనే రిలీజ్ చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశించారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న 33.53 శాతాన్ని 38.78 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఉద్యోగులకు చెల్లించాల్సిన మూడు డీఏ లలో…. ఈ రెండింటి విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ఈ విషయంలో అనుసరిస్తున్న విధానాన్ని మార్చాలని పేర్కొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… కేంద్రం డీఏ నిర్ణయించే విషయంలో చేస్తున్న ఆలస్యం వల్ల బకాయిలు పెరుకుపోతున్న ట్లు ఆరోపించారు.
ఇక ఆరు నెలలకు ఒకసారి చెల్లించాల్సిన డీఏ నీ రాష్ట్రంలోనే నిర్ణయించాలని డిసైడ్ అయ్యారు. ఈ సందర్భంగా అన్ని ప్రతిపాదనలు బేరీజు వేసుకుని స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని, సరిగ్గా దసరా ముందు రోజు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు.