(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నేడు విజయవాడ రానున్నారు. కిషన్ రెడ్డి సాయంత్రం ఢిల్లీ నుండి నేరుగా విజయవాడ రానున్నారు. తన పర్యటనలో భాగంగా ముందుగా విజయవాడ కనకదుర్గ అమ్మవారిని ఆయన దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అనంతరం సీతారాంపురం లో నూతనంగా ఏర్పాటు చేసిన బిజెపి రాష్ట్ర కార్యాలయాన్ని కిషన్ రెడ్డి ప్రారంభిస్తారు.
ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంలోనే రాష్ట్రంలో పార్టీ బలోపేతం తో పాటు పలు కీలక అంశాలపై రాష్ట్రపతి నాయకులతో చర్చించనున్నారు. తదుపరి గన్నవరం విమానాశ్రయం నుండి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. ఈ సందర్భంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలు, మూడు రాజధాని అంశం, తదితర కీలక అంశాలపై ఏం మాట్లాడనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.