am
తమిళ స్టార్ కథానాయకుడు అజిత్ 59వ చిత్రానికి `నెర్కొండు పార్వై`( నేరుగా చూడు.. అంటే వక్రబుద్ధితో ఆలోచించకు అనే అర్థంలో) అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఖాకి సినిమా డైరెక్టర్ హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ను, ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. బాలీవుడ్లో అమితాబ్, తాప్సీ ప్రధానంగా తెరకెక్కిన కోర్ట్ డ్రామా `పింక్` చిత్రానికి ఇది రీమేక్. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తమిళంలో నిర్మిస్తున్న చిత్రమిది. అమితాబ్ బచ్చన్ పాత్రను అజిత్ పోషిస్తుంటే.. తాప్సీ పాత్రను కన్నడ హీరయిన్ శ్రద్ధా శ్రీనాథ్ పోషిస్తున్నారు. అజిత్ తాజా చిత్రం `విశ్వాసం` బ్లాక్బస్టర్ హిట్ అయిన నేపథ్యంలో రానున్న `నేర్కొండు పార్వై` చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
previous post
next post
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?