ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా దేశంలో విధించిన లాక్ డౌన్ వలన దాదాపు 9 నెలలు అయ్యింది సినిమా కలెక్షన్స్ ను మనం తెలుసుకుని. లాక్ డౌన్ అప్పటి నుంచి ఓటిటి పుణ్యమా అని అసలు కలెక్షన్స్ మాటే మర్చిపోయాం. ఏకంగా 9 నెలల తర్వాత తెలుగులో థియేటర్లలో విడుదలైన తొలి క్రేజీ సినిమా సాయి ధరమ్ తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఈ సినిమా ను సుబ్బు అనే ఒక కొత్త దర్శకుడు తెరకెక్కించారు.
నిన్న సాయంత్రానికి ఈ సినిమా కి యావరేజ్ టాక్ వచ్చింది. దాదాపు 400 వరకు థియేటర్స్లో ఈ సినిమా ను రిలీజ్ చేశారు. వీటిలో ఎక్కువగా మల్టీప్లెక్సులే ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలోను ఇంకా కొన్ని జిల్లాలలో సింగిల్ స్క్రీన్స్ కూడా ఓపెన్ చేయలేదు పైగా కరోనా నేపథ్యంలో మల్టీప్లెక్సులలో కూడా కేవలం 50 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉండాలని నిబంధనను విధించారు. చివరికి అలా అన్ని కరోనా నిబంధనలు లోబడి ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
సాయి ధరమ్ తేజ్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు మరియు వెన్నెల కిషోర్ కామెడీ ఈ సినిమాకి హైలెట్గా నిలిచింది. తమన్ అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం పోశాయని అంటున్నారు. విమర్శకుల దగ్గర కూడా ఓవరాల్గా మంచి ఎంటర్టైనర్ అని టాక్ రావడంతో యూనిట్ ఊపిరి పీల్చుకుంది.
అయితే తొలి రోజున ఈ చిత్రం రూ.91.37 లక్షల రూపాయల వసూళ్లను నమోదు చేసింది. తూర్పు గోదావరి జిల్లాలో రూ.26 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.18 లక్షలు, గుంటూరు జిల్లాలో రూ.22 లక్షలు, కృష్ణ జిల్లాలో రూ.13 లక్షలు, అలాగే నెల్లూరులో 11 లక్షలు వసూలుచేసింది. ఇక సీడెడ్లో కూడా ఈ చిత్రం 52 లక్షల రూపాయలను రాబట్టడం విశేషంగా పేర్కొంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోను ఈ సినిమా రూ.2.80కోట్లను(4.7Cr+) రాబట్టనున్నట్లు తెలుస్తుంది.