విశాఖ జిల్లాలో టీడీపీ హయాంలో అక్రమాలకు గురైన భవనాలను, స్థలాలను ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం కూల్చేస్తూ స్వాధీనం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామంతో విశాఖపట్టణంలో టిడిపి పార్టీకి చెందిన నాయకులు గజగజలాడుతున్న సంగతి తెలిసిందే. విశాఖలో పరిస్థితి ఇలా ఉంటే విశాఖ తూర్పు లో పాలిటిక్స్ మరోలా వున్నాయి.
నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి అధికారం తో సంబంధం లేకుండా వెలగపూడి రామకృష్ణ బాబు విజయాలు మీద విజయాలు సాధిస్తున్నారు. వరుస విజయాలతో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఏపీ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర కూడా సృష్టించారు. వెలగపూడి ని దెబ్బకొట్టాలని గతంలో ప్రజారాజ్యం పార్టీలు అదేవిధంగా వైసిపి పార్టీలు అనేక వ్యూహాలు వేసిన గాని అవి ఏమీ పని చేయలేదు.
కానీ తాజాగా వెలగపూడి రామకృష్ణ బాబుని వైసీపీ పార్టీకి చెందిన ఓ మహిళా నేత మాత్రం తెగ టెన్షన్ పెట్టిస్తున్నట్లు విశాఖ జిల్లాలో వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే వైసీపీ నేత విజయ నిర్మల ప్రస్తుతం తూర్పు నియోజకవర్గం నుండి పార్టీకి సమన్వయ కర్తగా వ్యవహరిస్తుంది. ఇలాంటి తరుణంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న వెలగపూడి పట్ల ప్రత్యర్థులను రాజకీయంగా అనేక ఇబ్బందులు సృష్టిస్తున్న క్రమంలో తూర్పు నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి అన్ని తానై విజయ నిర్మల వ్యవహరిస్తుండటం తో వెలగపూడి వర్గానికి చెందిన వాళ్ళు తట్టుకోలేక పోతున్నారట. ఈ నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులలో ఉత్సాహాన్ని నింపుతూ మరోపక్క టీడీపీ శ్రేణుల తో ఢీ అంటే ఢీ అన్న రీతిలో విజయనిర్మల వ్యవహారం ఉందట. రాజధాని అమరావతి ని సపోర్ట్ చేస్తున్న తరుణంలో వెలగపూడి ని మరింత ఇరుకున పెట్టే రీతిలో విజయనిర్మల ఆందోళనలు నిరసనలు తూర్పు నియోజకవర్గంలో చేయటంతో వెలగపూడి పొలిటికల్ గా డామేజ్ అవుతుండటంతో ఆయనలో మరింత టెన్షన్ నెలకొన్నట్లు విశాఖ జిల్లా రాజకీయాల లో టాక్ నడుస్తుంది. మొత్తంమీద చూసుకుంటే వెలగపూడి తన పొలిటికల్ కెరియర్ లో ఎన్నడూ టెన్షన్ పడని రీతిలో ప్రస్తుతం ఉకిరి బిక్కిరి అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయ్.