బాలీవుడ్ యువ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జన్మదినం సందర్భంగా అతని కుటుంబ సభ్యులు ఎంతో ప్రశంసనీయమైన కార్యం తలపెట్టారు. సుశాంత్ సోదరి శ్వేత…. భౌతిక శాస్త్ర విద్యార్థుల కోసం యు సి లో బర్కిలీలో 35 వేల డాలర్ల సహాయం ప్రకటించింది.
ఈరోజు సుశాంత్ 35 వ జయంతి సందర్భంగా తనని అభిమానులు స్మరించుకున్నారు. అలాగే అతనికి సోషల్ మీడియాలో పంపిన హృదయపూర్వక సందేశాలు బాగా వైరల్ అయ్యాయి. ఇదే సందర్భంగా అతని సోదరి శ్వేతా సింగ్ కీర్తి అతని జ్ఞాపకార్ధం ప్రత్యేక స్కాలర్షిప్ ఫండ్ ప్రకటించింది. తన అన్న 35 వ పుట్టిన రోజున అతని కలలలో ఒక దానిని నెరవేర్చేందుకు ఒక అడుగు ముందుకు వేస్తున్నాను అని చెప్పిన శ్వేత ఎమోషన్ కు గురి అయ్యింది.
35 వేల డాలర్లతో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మెమోరియల్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నాను అని వ్యాఖ్యానించింది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం లోని భౌతిక విభాగంలో గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఆస్ట్రో ఫిజిక్స్ చదివేవారికి ఈ ఫౌండేషన్ ప్రాధాన్యత ఇస్తుందని ఆమె తెలిపింది.
సుశాంత్ భారతీయ చలనచిత్రాల్లో మంచి నటుడిగా తెలుసు కానీ అతను నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్ విజేత అని కొందరికే తెలుసు. అలాగే ఖగోళ శాస్త్రం మరియు ఖగోళ భౌతిక శాస్త్రం పై అతను జీవితకాల అభిరుచి కలిగి ఉన్నాడు అని కూడా అతని సోదరి శ్వేత చెప్పింది.
అందుకే ఈ ఫండ్ కోసం భౌతిక శాస్త్రం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని…. అందులో మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ తప్పక లభిస్తుంది అని ఆమె తెలిపింది. దాదాపు 25,54,186 రూపాయాలు ఈ స్కాలర్ షిప్ ద్వారా విద్యార్థులు పొందనున్నారు.