సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం “గీతా గోవిందం” డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది “సరిలేరు నీకెవ్వరు” సినిమా తో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని హ్యాట్రిక్ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నమోదు చేసుకోవడం జరిగింది.
ఇలాంటి తరుణంలో “సర్కారు వారి పాట” సినిమా మహేష్ చేస్తున్న నేపథ్యంలో సరికొత్త మేక్ఓవర్ తో పాటు బ్యాంకు కుంభకోణం తరహాలో సినిమా ఉండబోతున్నట్లు వార్తలు రావడంతో .. సినిమాపై మహేష్ అభిమానులు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ కావటంలో ఆలస్యం అవటంతో.. అనేక విమర్శలు సినిమా యూనిట్ పై వస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో మహేష్ బాబు ఫ్యామిలీ తో కలిసి టూర్ వేయబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల విమానాశ్రయంలో ఫ్యామిలీతో పాటు మహేష్ దిగిన ఫోటోలు వైరల్ కావడంతో .. ఈ వార్త సోషల్ మీడియాలో వినబడుతున్నాయి.