ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ … దురదృష్టకర పరిస్థితుల్లో ఏపీ లోని పలు దేవాలయాల్లో జరిగిన దుర్మార్గ ఘటనలు కాదు. పంచాయతీ ఎన్నికల వ్యవహారం.
ఈ రచ్చరచ్చపై ఎత్తులు , పై ఎత్తులు. ఎన్నికలకు ప్రభుత్వం ససేమిరా అంటుటే… ఆదివారం రోజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఇదే సమయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ చర్యలు , ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం .
నిమ్మగడ్డ … ఐయామ్ ద ఫైర్
ఎన్నికల నిర్వహణకే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ విషయంలో మనసు మార్చుకోవాల్సిందిగా ఆయన్ను కలిసి కోరేందుకు పంచాయతీ రాజ్ అధికారులు సిద్ధం అవుతోన్న సమయంలో నిమ్మగడ్డ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు ఐఏఎస్లు, ఒక ఐపీఎస్ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లను బదిలీ చేసిన ఎస్ఈసీ.. తిరుపతి అర్బన్ ఎస్పీ, పలమనేరు డీఎస్పీ, శ్రీకాళహస్తి డీఎస్పీ, పుంగనూర్, రాయదుర్గం, తాడిపత్రి సర్కిల్ ఇన్స్పెక్టర్లను విధుల నుంచి తప్పించాల్సిందిగా సూచించింది. గత ఏడాది మార్చిలో ఇచ్చిన ఆదేశాలను వెంటనే అమలు చేయాలని ఎస్ఈసీ ఆదేశించింది. గతంలో విధులు సరిగా నిర్వర్తించని అధికారులపై చర్యలకు సూచించింది ఎస్ఈసీ.. మొత్తంగా 9 మంది అధికారులను ఎన్నికల విధుల నుంచి ఎస్ఈసీ తొలగించింది. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను బదిలీ చేస్తూ ఎస్ఈసీ ప్రొసీడింగ్స్ జారీ చేసింది. తొలగించిన అధికారుల స్థానంలో కొత్త అధికారుల పేర్లు పంపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వమించే దిశగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
జగన్ …. తగ్గేదే లేదు
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు వార్తల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తో అడ్వకేట్ జనరల్ భేటీ అయ్యారు.
మంత్రి సుచరిత, ప్రభుత్వ సలహాదారు సజ్జల కూడా హాజరైన ఈ సమావేశంలో ప్రభుత్వ వైఖరి , పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి చర్చించారు. ఎన్నికల ప్రకటన విషయంలో ఎస్ఈసీ నుంచి వెలువడే నిర్ణయం ఆధారంగా చర్యలు తీసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.