Mahesh : మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట sarkar vaari paata . గతేడాది ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బాక్సాఫీస్ హిట్ కొట్టిన మహేష్ నెక్స్ట్ సినిమా వెంటనే పట్టాలెక్కించాలనుకున్నాడు. కాని కరోనా కారణంగా పోస్ట్ పోయింది. రీసెంట్ గా సర్కారు వారి పాట షూటింగ్ దుబాయ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 27వ సినిమాగా సర్కారు వారి పాట రూపొందుతుంది. కాగా పరశురామ్ – మహేష్ కాంబినేషన్ ఎలా ఉండబోతుందా అన్న క్యూరియాసిటీ అందరిలోను ఉంది.
ముఖ్యంగా మహేష్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.అయితే సర్కారు వారి పాట వచ్చే ఏడాది సంక్రాంతి పండుసగ సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆ సమయానికి ఏ సినిమా పోటీ లేదు. ఇక ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్.. జీఎంబీ ఎంటర్టైనన్మెంట్ .. మైత్రీ మూవీ మేకర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్ధిక కుంభకోణాలు బ్యాక్ డ్రాప్ లో సర్కారు వారి పాట సినిమాని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు పరశురామ్.
Mahesh : మోనాల్ సర్కారు వారి పాటలో స్పెషల్ సాంగ్ చేయడం లేదు..!
అయితే ఈ మధ్య సర్కారు వారి పాట సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిగ్ బాస్ తో మళ్ళీ లైం లైట్ లోకి వచ్చిన మోనాల్ గజ్జర్ ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయబోతుందన్న న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతోంది. మోనాల్ ఇటీవలే అల్లుడు అదుర్స్ లో ఐటెం సాంగ్ చేసి ఆకట్టుకుంది. దాంతో ఇది నిజమని అందరు భావించారు. కాని ఈ న్యుస్ కంప్లీట్ గా రూమరని తెలుస్తోంది. కాగా తాజాగా మోనాల్ ఈ విషయంలో స్పందించి.. తను సర్కారు వారి పాటలో ఎలాంటి స్పెషల్ సాంగ్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చిందట. ఒకరకంగా మహేష్ ఫ్యాన్స్ కి ఇది డిసప్పాయింట్ న్యూసే.