Sensex : భారత స్టాక్ మార్కెట్లో ఎన్నడూ లేనంత ధోరణితో ముందుకు పరిగెడుతున్నాయి. ప్రతిరోజు లాభమే తప్ప నష్టం రాని రీతిలో అవి అందనంత ఎత్తుకు వెళ్తున్నాయి. మంగళవారం 49 పాయింట్లు స్వల్పంగా నష్టపోయి నప్పటికీ బెంచ్మార్క్ అయినా 52 వేల మా ఇంట్లోనే సెన్స్్స్ కదలాడుతోంది.
Sensex : ఎగసి ఎగసిన మదుపు! జూలూ విదిల్చిన సూచిలు
వారంలో తొలి రోజు సోమవారం మంగళవారం కాస్త జోరు ను తగ్గించాయి. సోమవారం ఒకేసారి 600 పాయింట్లకు పైగా పెరగడంతో సెన్సెక్స్ చరిత్రలోనే 52 వేల పాయింట్లు మైలురాయిని ఎగబాకింది. నిఫ్టీ సైతం 15300 పాయింట్ల వద్ద ముగియడంతో మార్కెట్ సంపద ఒకేరోజు రూ 2 లక్షల కోట్లకు పైగా పెరిగి ఏకంగా మొత్తం సంపద 205 లక్షల కోట్లకు చేరింది. మొత్తం లాభాలతో మదుపరులు ఆనందంగా ఉన్నారు.
అంతటా సానుకూలం
భారతీయ స్టాక్ మార్కెట్ కు అన్ని రంగాల్లోనూ మార్గాల్లో ను సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ సంకేతాల దన్నుతో బ్యాంకింగ్ ఫైనాన్స్ షేర్ లకు కొనుగోళ్లు వెల్లువెత్తుతున్నాయి. జనవరిలో ద్రవ్యోల్బణం శాంతించడం డిసెంబర్లో పారిశ్రామికోత్పత్తి పుంజుకోవడం అత్యంత ప్రభావం చూపుతున్నాయి. విదేశీ పెట్టుబడులు సైతం స్టాక్ మార్కెట్ లోకి స్థిరంగా కొనసాగుతుండడంతో కలిగిస్తోంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఐదు పైసలు పెరిగి 72. 68 వద్ద ముగిసింది.
బ్యాంకింగ్ షేర్లకు ప్రాతినిధ్యం వహించే బ్యాంక్ నిఫ్టీ సూచీ సైతం చరిత్రలో తొలిసారిగా 37 వేల పాయింట్లను అధిగమించింది. ఇంట్రాడేలో సైతం మదుపరులకు మంచి లాభాలు వచ్చాయి. బ్యాంకింగ్ షేర్లను నమ్ముకున్న ప్రతి ఒక్కరూ మంచి సంపదను మూటగట్టుకున్నారు. ముఖ్యంగా బడ్జెట్ వచ్చిన తర్వాత బ్యాంకింగ్ షేర్లకు అడ్డు అదుపు లేకుండా సాగుతోంది.
అంచనా వేయడం కష్టం
స్టాక్ మార్కెట్ ఎంతమేర పెరుగుతుంది అనేది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ఎక్కడ అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న స్టాక్ మార్కెట్ గమనాన్ని మార్కెట్ నిపుణులు సైతం సరిగా చెప్పలేకపోతున్నారు. కరోనా కాలంలో పూర్తిగా బెర్ మన్న మార్కెట్ క్రమంగా పుంజుకోవడం ఏ కాదు… యాక్షన్ చరిత్ర సృష్టించే దిశగా సాగుతుండటంతో ఈగ మనం ఎంత వరకు వెళుతుంది అనేది ప్రఖ్యాత మార్కెట్ వర్గాలు సైతం విశ్లేషించ లేకపోవడం విశేషం. అంతా కొత్తవారితో నిండిపోయిన మార్కెట్ గమనంలో ఏసీ ముందుకు వెళ్తుంది వెనక్కి వెళ్తుంది అన్నది అంతుపట్టని ప్రశ్న గా మారుతోంది. కరోనా సమయంలో ఎక్కువగా మార్కెట్లోకి వచ్చిన యువతరం పూర్తిగా పెట్టుబడులు పెట్టడం లో కొత్త పంథాను అనుసరిస్తున్నారు.
వారు ఎంచుకున్న షేర్లు కూడా విభిన్నంగా ఉంటున్నాయి. మార్కెట్ గమనాన్ని కంపెనీల వ్యవహారాలను ఏమాత్రం పట్టించుకోకుండా అనేవారు పెడుతున్న పెట్టుబడులు ఎప్పటినుంచో మార్కెట్ ను అంచనా వేస్తున్న వారికి సైతం అంతుబట్టకుండా ఉన్నాయి. దీంతో భారతీయ స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఎలా కదలాడుతుంది ఏమిటి అన్నది అంతర్జాతీయ నిపుణులు సైతం చెప్పలేని పరిస్థితి ఉంది. మరోపక్క అంతర్జాతీయ స్థాయిలోనూ అన్నీ అనుకూల పరిణామాలు జరగడంతో మార్కెట్ ర్యాలీని ఇప్పట్లో ఆపడం కష్టమని జరుగుతున్న చర్చ మదుపరులకు మరింత ఉత్సాహాన్ని నింపుతుంది.