Pawan kalyan : పవన్ కళ్యాణ్ వర్సెస్ మహేష్ బాబు.. ఈసారి బాక్సాఫీస్ వద్ద వార్ భారీ స్థాయిలో ఉండబోతోంది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా 2022 సంక్రాంతికి తీసుకు వస్తున్నట్టు మేకర్స్ అఫీషియల్ గా వెల్లడించారు.
క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడికల్ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఏ.ఎం. రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. నిధి అగర్వాల్, శ్రీలంకన్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 17వ శతాబ్ధం నాటి కాలానికి ఆనుగుణంగా పలు భారీ సెట్స్ ని నిర్మించారు.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట కూడా శరవేగంగా షూటింగ్ సాగుతోంది. దుబాయ్ లో నెల రోజుల షెడ్యూల్ కంప్లీట్ అయిన ఈ సినిమా ఈనెల 22 నుంచి మరో షెడ్యూల్ కూడా దుబాయ్ లోనే మొదలవబోతోంది. పరశురాం దర్శకత్వం వహిస్తుండగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కూడా 2022 సంక్రాంతికి ఉంటుందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్థిక కుంభకోణం నేపథ్యంలో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది.
Pawan kalyan : పవన్ కళ్యాణ్ రేస్ లో ముందు ఉంటే సర్కారు వారు మాత్రం కాస్త డిలే..?
అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ – క్రిష్ల హరిహర వీరమల్లు సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ వచ్చి రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబట్టింది. ఈ సినిమా భారీ హిట్ .. కొత్త హిస్టరీ క్రియేట్ చేయబోతోంది అన్న టాక్ తెచ్చుకుంది. కాని ఇంకా సర్కారు వారి పాట నుంచి మాత్రం మేకర్స్ ఇంకా టీజర్ గాని ఫస్ట్ గ్లింప్స్ గాని వస్తుందన్న హింట్ కూడా ఇవ్వడం లేదు. మరి బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్న పవన్ కళ్యాణ్ రేస్ లో ముందు ఉంటే సర్కారు వారు మాత్రం కాస్త డిలే అవుతున్నాడని అంటున్నారు.