కడప, మార్చి 16: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి అంత్యక్రియలను శనివారం పులివెందులలో అభిమానుల అశ్రునయనాల మధ్య నిర్వహించారు. వివేకా మృతదేహాన్ని ఆయన నివాసం నుండి ఊరేగింపుగా వైఎస్ రాజారెడ్డి ఘాట్ వద్దకు తీసుకువెళ్లారు.
వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిల, వివేకా భార్య సౌభాగ్య , కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ ఇతర కుటుంబ సభ్యులు, పెద్ద సంఖ్యలో వైఎస్ కుటుంబ అభిమానులు, వైసిపి నేతలు అంతిమయాత్రలో పాల్గొన్నారు.
కుటుంబ సభ్యులు, అభిమానులు వివేకా మృతదేహాన్ని కడసారి తిలకించి పూలు చల్లి నివాళులర్పించారు.
వివేకా తండ్రి రాజారెడ్డి సమాధి వద్దనే వివేకానంద రెడ్డి భౌతికకాయానికి అంతిమ సంస్కారాలను కుటుంబ సభ్యులు నిర్వహించారు.
క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ప్రార్థనలు నిర్వహించి వివేకా పార్థివ దేహాన్ని ఖననం చేశారు. వైసిపి నేతలు విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అవినాష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.