NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Tirupati By poll : తిరుపతి ప్రచార సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

Tirupati By poll : తిరుపతి ఉప ఎన్నికలలో బీజెపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ విజయాన్ని కాంక్షిస్తూ శనివారం రాత్రి జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు గుండాగిరి చేస్తున్నారని దుయ్యబట్టారు. తనను సినిమాల్లోకి వెళ్లాడంటూ విమర్శిస్తున్న వారికి సమాధానంగా తనకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పేకాట క్లబ్ లు లేవని అన్నారు. తాను సినిమాలు మానేసి అడ్డదారులు తొక్కనని అన్నారు. భయాన్ని విడనాడి అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం, తెగింపు రావాలన్నారు. చైనా వాళ్లు మన భూభాగంలోకి వచ్చి మన వాళ్లను కాల్చేస్తుంటే ఇక్కడి వాళ్లు శేషాచలంలో ఎర్రచందనం చెట్లను నరికి చైనాకు స్మగ్లింగ్ చేస్తున్నారనీ వీరికి దేశ భక్తి ఎక్కడ ఉందని ప్రశ్నించారు.

Tirupati By poll pawan kalyan speech
Tirupati By poll pawan kalyan speech

40 ఏళ్ల సివిల్ సర్వీస్ లో విశిష్టమైన సేవలు అందించిన రత్న ప్రభ మానవహక్కుల కోసం పని చేశారన్నారు. ఏపి ఐటీ హబ్ గా ఉందంటే దానికి రోడ్ మ్యాప్ వేసింది రత్నప్రభే నని గుర్తు చేశారు. వైసీీపీ అభ్యర్థి ఎంపిగా గెలిస్తే ఎమి చేయగలరో చెప్పాలన్నారు. ఆయన గెలిస్తే ఎమీ మాట్లాడలేరనీ, పార్టీ కంట్రోల్ లోనే ఉంటారనీ విమర్శించారు. రత్న ప్రభ గెలిస్తే సమస్యలను చెప్పుకోవచ్చని అన్నారు.

151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపిలు ఉండి ఏమి చేయలేకపోయారని అన్నారు. రాష్ట్రంలో ప్రజల క్షేమం, అభివృద్ధి జరగాలంటే అధికార బదలాయింపు జరగాలన్నారు. తాను సీఎం పదవి గురించి ఎప్పుడూ ఆలోచించలేదనీ. ఒక వేళ సీఎం పదవి వస్తే ఏడు కొండల వాడి సాక్షిగా అందరి కంటే ఎక్కువ సేవ చేయగలనని అన్నారు. అయితే తాను దాని కోసం అర్రులు చాచడం లేదన్నారు. ప్రజలు నోటు తీసుకుంటే నైతిక హక్కు కోల్పోతారనీ రూ.2వేలకు భవిష్యత్తు అమ్ముకోవద్దని సూచించారు పవన్ కల్యాణ్. ఇక్కడి నుండి బరిలో ఉన్న రత్నప్రభను ఆదరించాలని పవన్ విజ్ఞప్తి చేశారు. తొలుత అభ్యర్థి రత్నప్రభ పవన్ కళ్యాణ్ కు రాఖీ కట్టి స్వాగతం పలికారు.

బహిరంగ సభకు ముందు తిరుపతి లోని ఎమ్మర్ పల్లి కూడలి నుండి శంకరంబాడి కూడలి వరకూ పవన్ పాదయాత్ర గా చేరుకున్నారు. అనంతరం శంకరంబాడి విగ్రహం వద్ద నిర్వహించిన సభలో ప్రసంగించారు. ఈ సభలో బీజేపీ నేత సునీల్ దేవధర్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన నేత నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju