Bollywood : కరోనా కారణంగా గత ఏడాది మొత్తం అన్నీ పరిశ్రమలు మూతపడి ఉద్యోగాలు లేక జీవితాలు చిన్నా భిన్నం అయిన సంగతి తెలిసిందే. దాదాపు సంవత్సరం దాటిపోయినా కరోనా విషయంలో వణుకు పోనేలేదు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి ఇప్పటికే వేల కోట్లలో నష్టం వాటిల్లింది. అన్నిటికంటే బాలీవుడ్ ఇండస్ట్రీ మార్కెట్ చాలా పెద్దది. అలాంటిది మరోసారి బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని కరోనా విజృంభణతో వణికిస్తోంది. ఇప్పటికే అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ సహా పలువురు బాలీవుడ్ స్టార్స్ కి కరోనా పాజిటివ్ వచ్చి సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారు.
అక్షయ్ కుమార్ హాస్పిటల్ లో జాయిన్ కూడా అయ్యారని వార్తలు వచ్చాయి. కాగా ఇప్పుడు ఏకంగా థియేటర్స్ మూతపడటంతో పాటు రిలీజ్ కావాల్సిన సినిమాలని నిలిపి వేశారు. ఈ సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేస్తారా లేదా అన్నది క్లారిటీ లేనప్పటికి ప్రస్తుతం రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సినిమాలని పోస్ట్ పోన్ చేశారట. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సూర్యవన్షి సినిమా ఈ నెలలో రిలీజ్ కావాల్సి ఉండగా మేకర్స్ పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రకటించారు.
Bollywood : మొత్తానికి కరోనా సెకండ్ వేవ్తో బాలీవుడ్ వణికిపోతోంది.
ఈ సినిమాకి రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. భారీ అంచనాలున్న ఈ సినిమా మీద అక్షయ్ కుమార్ చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. ఆయన నటించిన గత చిత్రం లక్ష్మీ కాస్త నిరాశ పరచిన సంగతి తెలిసిందే. అందుకే ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. కాగా ఈ సినిమాతో పాటు ‘రాధే’, ‘సత్యమేవ జయతే’, ‘షంషేరా’ సినిమాలు కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మొత్తానికి కరోనా సెకండ్ వేవ్తో బాలీవుడ్ వణికిపోతోంది. మరి మళ్ళీ తిరిగి అక్కడ పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో అని బాలీవుడ్ మేకర్స్..హీరోలు ఎదురు చూస్తున్నారు.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!