Tragedy in Tollywood: తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఆల్ ఇండియా రేడియో, సినీ సంగీత దర్శకుడ కెఎస్ చంద్రశేఖర్ కరోనాతో మరణించారు. ఆయన మరణ వార్తను సినీరంగంలో కొనసాగుతున్న ఆయన మేనల్లుడు మహేంద్ర చిత్ర పరిశ్రమకు, మీడియాకు తెలియజేశారు. చంద్రశేఖర్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా రాయలం గ్రామం. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
1990లో ఆల్ ఇండియా రేడియో లో గ్రేడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్ విశాఖ వాసులకు సుపరిచితులైయ్యారు. బంట్రోతు భార్య సినిమాతో నేపథ్య గాయకుడిగా సినీరంగ ప్రవేశం చేసిన చంద్రశేఖర్.. సంగీత దర్శకులు చక్రవర్తి, రమేష్ నాయుడు, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ వద్ద సహాయకడుగా పని చేశారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన యమకింకరులు మువీ ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. బ్రహ్మముడి, హంతకుడి వేట, ఆణిముత్యం, ఉదయం, అదిగో అల్లదిగో భోళాశంకరుడు, ఆత్మ బంధువులు, కంచి కామాక్షి ఇలా దాదాపు 30కి పైగా సినిమాలకు సంగీతాన్ని సమకూర్చారు. విశాఖ ఆల్ ఇండియా రేడియో గ్రేడ్ 1 మ్యూజిక్ డైరెక్టర్ గా సేవలు అందిస్తూ ఇటీవలే పదవీ విరమణ అయ్యారు. కీరవాణి, కోటి మణిశర్మ ఆయన దగ్గర శిష్యరికం చేశారు. చంద్రశేఖర్ మృతికి పలువురు తమ సంతాపం తెలియజేశారు.
ఇటీవలే సీనియర్ సినీ గాయకుడు జి ఆనంద్ కరోనా బారిన పడి మృతి చెందారు. అంతకు ముందు గత నెలలో సినీ నిర్మాత ఇలా కరోనా బారిన పడి మృతి చెందారు. గత ఏడాది ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం కూడా కరోనాతో మరణించిన విషయం తెలిసిందే.