NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Village Secretariats: గ్రామ సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ ఝలక్..!!

AP Village Secretariats: వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ రాష్ట్రంలో గ్రామ సచివాలయ ఉద్యోగులకు షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్ అటిండెన్స్ విధానాన్ని తప్పనిసరి చేసింది. సచివాలయ ఉద్యోగులు విధిగా ఉదయం, సాయంత్రం రెండు సమయాల్లో కశ్చితంగా  బయోమెట్రిక్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు తాజాగా మరో కీలక ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు రెండు దశల్లో నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులు అయితేనే ప్రొబేషన్ పూర్తి అయినట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

AP Village Secretariats employees must qualified departmental tests
AP Village Secretariats employees must qualified departmental tests

Read More: Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కు తగ్గేది లే..! మరో సారి స్పష్టం చేసిన కేంద్రం..!!

ఈ ఏడాది అక్టోబర్ రెండు నాటికి గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి రెండేళ్లు పూర్తి అవుతుంది. గ్రామ సచివాలయ ఉద్యోగులకు ముందుగా రెండేళ్ల ప్రొబేషన్ పిరియడ్ గా పేర్కొంది. రెండేళ్లు పూర్తి అయిన వెంటనే పేస్కే ల్ తో వారిని పర్మినెంట్ ఉద్యోగులు అవుతారని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో రెండేళ్లు పూర్తి అయిన వెంటనే వారికి పేస్కేల్, డీఏ, హెచ్ఆర్ఏ తదితర అలవెన్స్ తో జీతం పెరుగుతుంది. త్వరలో తమ ప్రొబిషన్ పూర్తి అవుతుంది జీతాలు పెరుగుతాయని ఆశ పడుతున్న గ్రామ సచివాలయ ఉద్యోగుల ఆశలకు నీళ్లు చల్లేలా ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి.

 

ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం ప్రొబేషన్ పూర్తి చేసుకున్న వారు రెండు పరీక్షల్లో (డిపార్ట్‌మెంటల్ టెస్ట్స్)  పాస్ అయితేనే వారికి పే స్కేల్ ఫిక్స్ అవుతుంది. ప్రభుత్వ పథకాలు, శాఖాపరమైన అంశాలు, డిజిటల్ సేవలు వంటి వాటిపైనే ప్రశ్నలు ఉంటాయని తెలిపింది. ఈ పరీక్షల్లో ఫెయిలైన వారికి మరోసారి పరీక్ష నిర్వహిస్తారు. అన్ని పరీక్షలను ఆన్ లైన్ ద్వారా ఏపిపిఎస్‌సీ నిర్వహించనున్నది. ఏపిలో ప్రస్తుతం 1.34 లక్షల మంది గ్రామ సచివాలయాల్లో ఉద్యోగులుగా పని చేస్తున్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రతిష్టాత్మంగా తీసుకువచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మేలైన సేవలు అందుతున్నాయి. వివిధ పనుల నిమిత్తం గతంలో వివిధ శాఖల కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిన తరువాత గ్రామాల్లోని ప్రజలు ఎక్కువ ప్రభుత్వ సేవలు గ్రామాల్లోనే పొందుతున్నారు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంపై ఆయా సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.

Related posts

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?