అవును.. ఈ విషయంలో కడకు పవన్ వ్యూహం ఫలించింది. ఏపీ ప్రభుత్వం జనసేనాని దెబ్బకు దిగొచ్చింది. విషయంలోకి వెళితే, ఆంధ్రప్రదేశ్లో సినిమా టిక్కెట్ల ధరల రచ్చ గురించి మనకు తెలిసినదే. గత కొంతకాలంగా ఈ విషయంలో అటు ఏపీ ప్రభుత్వానికి, ఇటు టాలీవుడ్ కి కోల్డ్ వార్ నడుస్తోంది. ఎవరి మాట ఎలావున్నా ఈ సమస్య గురించి మొదటి రెస్పాండ్ అయ్యింది మాత్రం పవర్ స్టార్ అనే చెప్పుకోవాలి. ఆయన బహిరంగంగానే ఏపీ ప్రభుత్వంతో సినిమా టిక్కెట్ల విషయంలో గొడవ పడ్డారు. అయితే ఈ విషయంలో పవన్ కి ఏఒక్కరూ మద్దతు తెలపకపోవడం కొసమెరుపు.
ప్రస్తుతం సినిమా టిక్కెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం ఇదే…
ఈ విషయంలో గందరగోళంలో పడిన తెలుగు సినీ పరిశ్రమకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సినిమాల విడుదల సమయంలో మాత్రమే టిక్కెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూ ఈరోజు అనగా శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. అధికారుల కమిటీ సిఫారసుల మేరకు ఈ టికెట్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ ప్రభుత్వం తెలిపింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఏసీ థియేటర్లలో 50 నుంచి 150 రూపాయల వరకు ధర ఉండొచ్చని స్పష్టం చేసింది. మల్టీప్లెక్స్ల్లో అయితే రూ.100-250ల మధ్య, మల్టీప్లెక్స్ల్లో రిక్లైనర్ సీట్లకు గరిష్ఠంగా 300 రూపాయలు వసూలు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.
తెలంగాణలో సినిమాల పరిస్థితి ఏమిటి?
తెలంగాణలో సినిమా టికెట్ ధరలను పెంచేందుకు అనుమతి ఇవ్వాలంటూ థియేటర్ల యజమానులు గతంలో హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసినదే. వారి విన్నపాన్ని మన్నించిన ఉన్నత న్యాయస్థానం టిక్కెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూ తాజాగా తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో టిక్కెట్ ధరల విషయమై రాష్ట్ర ప్రభుత్వం అధికారుల కమిటీని ఒకదాన్ని నియమించింది. సినీరంగ ప్రముఖులతో చర్చలు జరిపిన కమిటీ ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేసినట్టు సమాచారం. అందువలనే సర్కారు దిగొచ్చింది.