CM YS Jagan Delhi Tour: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఈ సారి సీఎం జగన్ ఢిల్లీ టూర్ గ్రాండ్ సక్సెస్ కిందే చెప్పుకోవచ్చు. ప్రధాన మంత్రి మోడీతో సహా ఆరుగురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై వినతి పత్రాలను అందించారు. నిన్న మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న సీఎం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు కొనసాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ సమస్యలను ప్రధాన మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు జగన్. పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.
Read More: TDP: టీడీపీకి జేసి బ్రదర్స్ రాజీనామా..?
CM YS Jagan Delhi Tour: కేంద్ర మంత్రులతో భేటీలు
అనంతరం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాధిత్య సింధియాతో సమావేశమయ్యారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, సవరించిన పోలవరం అంచనా వ్యయానికి ఆమోదం, రెవెన్యూ లోటు భర్తీ, రుణ పరిమితి పెంపు తదితర అంశాలను జగన్ ప్రస్తావించారు. తదుపరి విమానయాన మంత్రి జ్యోతి రాదిత్య సింథియా భేటీలో..విశాఖ అభివృద్ధికి భోగాపురం కీలకమనీ, గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం అభివృద్ధికి సహకరించాలని కోరారు. కాగా ఈ రోజు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైయ్యారు. విశాఖలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆరు లైన్ల రహదారిని మంజూరు చేయాలని కోరారు. విశాఖ పోర్టు నుండి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకూ జాతీయ రహదారి డీపీఆర్ తయారీ అంశంపై చర్చించారు. అదే విధంగా విజయవాడ తూర్పు బైపాస్ పై గతంలో చేసిన విజ్ఞప్తిని పరిశీలించాలని మంత్రిని కోరిన జగన్..భూసేకరణను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు.
అనంతరం కేంద్ర సమాచార, క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో జగన్ భేటీ అయ్యారు. ఏపిలో క్రీడా మైదానాల అభివృద్ధి సహా పలు అంశాలపై సీఎం జగన్ చర్చించారు. తదుపరి కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో సమావేశమై పలు విద్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించి సహకరించాలని కోరనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉందని అంటున్నారు.