Pawan kalyan: ‘భీమ్లా నాయక్’ మూవీ కోసం ఆ రెండూ కాదు మరో కొత్త రిలీజ్ డేట్ను మేకర్స్ చూస్తున్నట్టు తాజాగా ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా ఇది. ఈ సినిమా ఇప్పుడు విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకొని అప్పుడెప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కరోనా వేవ్స్ కారణంగా లేట్ అయింది. ప్రస్తుతం పవన్ పాల్గొనే ఫైనల్ సాంగ్ భీమ్లా నాయక్ షూటింగ్ జరుగుతోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా గురించి ఓ వార్త ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా కోసం రెండు డేట్స్ ను మేకర్స్ ఓకే చేసి పెట్టుకున్నారు. వాటిలో ఒకటి ఫిబ్రవరి 25. మరొకటి ఏప్రిల్ 1వ తేదీ. రానా మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నిత్యా మీనన్ పవన్కు భార్యగా నటిస్తోంది. రానాకు భార్యగా సంయుక్త మీనన్ నటిస్తోంది. భారీ అంచనాలున్న ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు ప్రతీ ఒక్కరు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దాదాపు ఫిబ్రవరి 25వ తేదీనే రిలీజ్ అవుతుందని అభిమానులందరూ భావిస్తున్నారు. అయితే, ఇప్పుడు కొత్తగా వస్తున్న వార్తల ప్రకారం ఫిబ్రవరి 25, ఏప్రిల్ 1వ తేదీలలో రిలీజ్ అయ్యే అవకాశాలు లేవని అంటున్నారు. అందుకు కారణం తమిళ హీరో అజిత్ నటించిన వలిమై సినిమా అని తెలుస్తోంది.
Pawan kalyan: ఎందుకు డిసైడ్ అయ్యారో తెలియాల్సి ఉంది.
ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రిలీజ్ రైట్స్ను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు తీసుకున్నారట. వలిమై తమిళంలో తో పాటు మిగతా భాషలలోనూ ఫిబ్రవరి 24వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. అందుకే ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ సినిమాను రిలీజ్ చేయకుండా ఏప్రిల్ 8వ తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ కొత్త డేట్ను చూస్తున్నారట. మరి ఫిబ్రవరి 25 కాకపోతే ఏప్రిల్ 1వ తేదీన వస్తామని ప్రకటించిన దర్శక, నిర్మాతలు ప్రకటించారు. మరి ఆ తేదీన కాకుండా ఇప్పుడు ఏప్రిల్ 8వ తేదీన వద్దామని ఎందుకు డిసైడ్ అయ్యారో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు దర్శకుడు సాగర్ కె చంద్ర. సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!