Krithi Shetty: కృతి శెట్టి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఉప్పెన` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకుంది. అదే సమయంలో మైమరపించే అందం, అభినయంతో యూత్ను కట్టిపడేసింది. ఉప్పెన తర్వాత ఈమె చేసిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలు సైతం మంచి విజయం సాధించడంతో.. కృతి శెట్టి స్టార్ హీరోయిన్గా మారిపోయింది.
హ్యాట్రిక్ హిట్స్తో ఫుల్ జ్యోష్లో ఉన్న ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్లో దూసుకుపోతోంది. ఇక త్వరలోనే కృతి కోలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతోంది. ఈ విషయాన్ని స్టార్ హీరో సూర్య తాజాగా కన్ఫామ్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల `ఈటి`తో ప్రేక్షకులను పలకరించిన సూర్య తన 41వ చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్ బాలాతో అనౌన్స్ చేశాడు.
వీళ్ళిద్దరి కాంబోలో తెరకెక్కిన ‘నంద’, ‘శివపుత్రుడు’ చిత్రాలు ప్రేక్షకులను బాగానే అలరించాయి. మళ్ళీ 18ఏళ్ళ తర్వాత బాలా దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సూర్య గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్గా మెరవబోతోందని మేకర్స్ అధికారికంగా తెలిపారు.
సూర్య తన సొంత నిర్మాణ సంస్థ అయిన 2డీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్పై నిర్మితం కానున్న ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమా ప్రయోగాత్మకంగా ఉండనుందని..ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేయనున్నాడని అంటున్నారు. పైగా అందులో సూర్య ఇప్పటి వరకూ చేయని చెవిటి – మూగ పాత్ర ఒకటని అంటున్నారు.
Happy to be on board #Suriya41 @Suriya_offl sir #Directorbala sir @2D_ENTPVTLTD ❤️ Have been receiving many warm wishes since morning………feeling grateful, thank you so much 💝 pic.twitter.com/JD7y1vnpQO
— KrithiShetty (@IamKrithiShetty) March 28, 2022
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?