తమిల్ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా తేరకెక్కిన “వారియర్” ఇటీవల విడుదల అవటం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. మొదటి రోజే డిజాస్టర్ టాక్ వచ్చింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్ ఫస్ట్ టైం కనిపించినా గానీ పెద్దగా అలరించలేకపోయాడు. దీంతో ఇప్పుడు “వారియర్” ఎఫెక్ట్ కారణంగా నెక్స్ట్ బోయపాటితో చేయబోయే సినిమా విషయంలో రామ్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు లేటెస్ట్ టాక్ నడుస్తోంది.
ముఖ్యంగా బోయపాటితో చేయబోయేది పాన్ ఇండియా సినిమా కావటంతో స్క్రిప్ట్ విషయంలో రామ్.. సలహాలు ఇస్తున్నట్లు సమాచారం. ఉత్తరాది ప్రేక్షకులకు నచ్చే రీతిలో.. ఇటీవల స్టొరీలో బోయపాటికి కొన్ని మార్పులు రామ్ చెప్పినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. త్వరలోనే సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. అయితే వారియర్ దారుణంగా పరాజయం పాలు కావడంతో… హీరో రామ్ బోయపాటి ప్రాజెక్ట్ విషయంలో జాగ్రత్త పడుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
మరోపక్క బోయపాటి గత ఏడాది బాలయ్యతో “అఖండ” తీసి బ్లాక్ బస్టర్ అందుకోవటం జరిగింది. అయితే ఫస్ట్ టైం రామ్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తూ ఉండటంతో… ఈ సినిమాని బోయపాటి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. ఈ సినిమాలో రామ్..నీ రెండు డిఫరెంట్ పాత్రలలో బోయపాటి చూపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకటి పవర్ ఫుల్ మాస్ పాత్ర అని మరొకటి బాలకృష్ణ అభిమానిగా.. రామ్ నీ చూపించడానికి రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!